Ayyanna Patrudu Issue:నర్సీపట్నంలో టెన్షన్.. టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సీపట్నంలో వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చేందుకు తీసుకుని వచ్చిన జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. అనకాపల్లి నుంచి వస్తున్న జేసీబీని దుంగనవానిపాలెం దగ్గర అడ్డుకుని గాలి తీసేసి నిరసన తెలిపారు. అయ్యన్న ఇంటి దగ్గరే మకాం వేసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అధికారులను అడ్డుకుంటున్నారు. నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే.టీడీపీలో బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు జగన్ పాల్పడుతున్నారని బాబు మండిపడ్డారు. మరోవైపు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర సర్వే ప్రారంభమైంది. అయితే ఈ సర్వేకు బ్రేక్ పడింది.
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర రెవెన్యూ శాఖ ప్రారంభించిన సర్వేకు బ్రేక్ వేశారు. జాయింట్ సర్వే చేయించాలని అయ్యన్న కుటుంబం కోరింది. ప్రభుత్వ, ప్రయివేట్ సర్వేయర్ల సమక్షంలో రేపు భూమి సర్వే నిర్వహించాలని అభ్యర్థించారు. జాయింట్ సర్వేకు జిల్లా యంత్రాంగం అంగీకారం తెలిపింది. పోలీసు భద్రత మధ్య భూమి కొలతలు తీస్తున్నారు రెవిన్యూ సిబ్బంది. రెండు సెంట్ల కాలువ భూమి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు ఇరిగేషన్ అధికారులు. అయ్యన్న కుటుంబానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు నర్సీపట్నం తరలివస్తున్నారు.
అయ్యన్నపాత్రుడు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ల వరద సాగుతూనే వుంది. గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్గా కనిపించింది. ఎన్టీఆర్ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్గా కనిపించింది. ఎన్టీఆర్ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!