Ayyanna Patrudu Issue:నర్సీపట్నంలో టెన్షన్.. టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సీపట్నంలో వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చేందుకు తీసుకుని వచ్చిన జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. అనకాపల్లి నుంచి వస్తున్న జేసీబీని దుంగనవానిపాలెం దగ్గర అడ్డుకుని గాలి తీసేసి నిరసన తెలిపారు. అయ్యన్న ఇంటి దగ్గరే మకాం వేసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అధికారులను అడ్డుకుంటున్నారు. నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే.టీడీపీలో బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు జగన్ పాల్పడుతున్నారని బాబు మండిపడ్డారు. మరోవైపు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర సర్వే ప్రారంభమైంది. అయితే ఈ సర్వేకు బ్రేక్ పడింది.
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర రెవెన్యూ శాఖ ప్రారంభించిన సర్వేకు బ్రేక్ వేశారు. జాయింట్ సర్వే చేయించాలని అయ్యన్న కుటుంబం కోరింది. ప్రభుత్వ, ప్రయివేట్ సర్వేయర్ల సమక్షంలో రేపు భూమి సర్వే నిర్వహించాలని అభ్యర్థించారు. జాయింట్ సర్వేకు జిల్లా యంత్రాంగం అంగీకారం తెలిపింది. పోలీసు భద్రత మధ్య భూమి కొలతలు తీస్తున్నారు రెవిన్యూ సిబ్బంది. రెండు సెంట్ల కాలువ భూమి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు ఇరిగేషన్ అధికారులు. అయ్యన్న కుటుంబానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు నర్సీపట్నం తరలివస్తున్నారు.
అయ్యన్నపాత్రుడు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ల వరద సాగుతూనే వుంది. గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్గా కనిపించింది. ఎన్టీఆర్ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్గా కనిపించింది. ఎన్టీఆర్ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2022
తాజావార్తలు
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!