Ayyanna Patrudu Issue:నర్సీపట్నంలో టెన్షన్.. టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సీపట్నంలో వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చేందుకు తీసుకుని వచ్చిన జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. అనకాపల్లి నుంచి వస్తున్న జేసీబీని దుంగనవానిపాలెం దగ్గర అడ్డుకుని గాలి తీసేసి నిరసన తెలిపారు. అయ్యన్న ఇంటి దగ్గరే మకాం వేసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అధికారులను అడ్డుకుంటున్నారు. నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే.టీడీపీలో బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు జగన్ పాల్పడుతున్నారని బాబు మండిపడ్డారు. మరోవైపు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర సర్వే ప్రారంభమైంది. అయితే ఈ సర్వేకు బ్రేక్ పడింది.
Also Read
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర రెవెన్యూ శాఖ ప్రారంభించిన సర్వేకు బ్రేక్ వేశారు. జాయింట్ సర్వే చేయించాలని అయ్యన్న కుటుంబం కోరింది. ప్రభుత్వ, ప్రయివేట్ సర్వేయర్ల సమక్షంలో రేపు భూమి సర్వే నిర్వహించాలని అభ్యర్థించారు. జాయింట్ సర్వేకు జిల్లా యంత్రాంగం అంగీకారం తెలిపింది. పోలీసు భద్రత మధ్య భూమి కొలతలు తీస్తున్నారు రెవిన్యూ సిబ్బంది. రెండు సెంట్ల కాలువ భూమి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు ఇరిగేషన్ అధికారులు. అయ్యన్న కుటుంబానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు నర్సీపట్నం తరలివస్తున్నారు.
అయ్యన్నపాత్రుడు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ల వరద సాగుతూనే వుంది. గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్గా కనిపించింది. ఎన్టీఆర్ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్గా కనిపించింది. ఎన్టీఆర్ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2022
తాజావార్తలు
-
Ragi Punugulu – Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Peddi: నైజాంలో రామ్ చరణ్ ‘పెద్ది’కి బిగ్ షాక్
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!