Andhra Pradesh: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగేళ్ల క్రితం నిర్వహించిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఎంపికైన 165 మంది అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం నాడు వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 167 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా 165 పోస్టులను భర్తీ చేసింది. మరో రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేసింది.
Read Also: Driverless Car: ఐఐటీ హైదరాబాద్ మరో ఆవిష్కరణ.. ఇండియాలోనే తొలి డ్రైవర్ లెస్ కారు టెస్ట్ రన్
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ఏపీపీఎస్సీ గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ లో 167 పోస్టులలో డిప్యూటీ కలెక్టర్లు-30, అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్స్-8, డీఎస్పీలు-27, డీఎస్సీ(జైళ్ల శాఖ)-1, డీఎఫ్వో-1, అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు-11, ఆర్టీవోలు-5, అసిస్టెంట్ ప్రొహిబిషన్-మల్టీజోన్1 – 06, మల్టీ జోన్ 2-05, ఎంపీడీవోలు-47, జిల్లా రిజిస్ట్రార్లు-01, జిల్లా ఉపాధి కార్యాలయం-02, సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్స్- 01(జోన్-2), 01 (జోన్-3), జిల్లా గిరిజన అధికారి-01, ఎస్సీ సంక్షేమ అధికారి-01, బీసీ సంక్షేమ అధికారి-01, డీపీవో-01, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు-1, ఏపీ వైద్యారోగ్య పరిపాలన శాఖలో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు- మల్టీజోన్1- 06, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2 (జోన్-3), 4 (జోన్-4)
కాగా గ్రూప్-1 పరీక్షల ఫలితాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని.. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 167 పోస్టుల భర్తీకి లక్షన్నరకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని.. 325 మందిని ఇంటర్వూ వరకు వచ్చారని.. కోర్టు తీర్పుకు లోబడి ఈ ఫలితాలు వర్తిస్తాయని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. 2018 నుంచి ఫలితాల విడుదలలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని.. పరీక్షల నిర్వహణ కోసం టెక్నాలజీని వినియోగించామని తెలిపారు. డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేశామన్నారు. వచ్చే నెలలనే గ్రూపు1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ అభ్యర్థులు లేవనెత్తిన అంశాలపై అన్ని అంశాలపై కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లామని.. ఈ మేరకు అభ్యర్థులు గవర్నర్కు ఫిర్యాదు చేయగా.. ఏపీపీఎస్సీని రాజ్భవన్ వివరణ కోరిందన్నారు. పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు అన్ని అంశాలను గవర్నర్ కు వివరించామని.. అభ్యర్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పూర్తి పారదర్శకంగానే మూల్యాంకనం జరిగిందని వివరించారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీపీఎస్సీ యువతకు స్పష్టమైన హామీ ఇస్తుంది.
తాజావార్తలు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!