Andhra Pradesh: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగేళ్ల క్రితం నిర్వహించిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఎంపికైన 165 మంది అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం నాడు వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 167 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా 165 పోస్టులను భర్తీ చేసింది. మరో రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేసింది.
Read Also: Driverless Car: ఐఐటీ హైదరాబాద్ మరో ఆవిష్కరణ.. ఇండియాలోనే తొలి డ్రైవర్ లెస్ కారు టెస్ట్ రన్
Also Read
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
ఏపీపీఎస్సీ గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ లో 167 పోస్టులలో డిప్యూటీ కలెక్టర్లు-30, అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్స్-8, డీఎస్పీలు-27, డీఎస్సీ(జైళ్ల శాఖ)-1, డీఎఫ్వో-1, అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు-11, ఆర్టీవోలు-5, అసిస్టెంట్ ప్రొహిబిషన్-మల్టీజోన్1 – 06, మల్టీ జోన్ 2-05, ఎంపీడీవోలు-47, జిల్లా రిజిస్ట్రార్లు-01, జిల్లా ఉపాధి కార్యాలయం-02, సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్స్- 01(జోన్-2), 01 (జోన్-3), జిల్లా గిరిజన అధికారి-01, ఎస్సీ సంక్షేమ అధికారి-01, బీసీ సంక్షేమ అధికారి-01, డీపీవో-01, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు-1, ఏపీ వైద్యారోగ్య పరిపాలన శాఖలో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు- మల్టీజోన్1- 06, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2 (జోన్-3), 4 (జోన్-4)
కాగా గ్రూప్-1 పరీక్షల ఫలితాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని.. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 167 పోస్టుల భర్తీకి లక్షన్నరకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని.. 325 మందిని ఇంటర్వూ వరకు వచ్చారని.. కోర్టు తీర్పుకు లోబడి ఈ ఫలితాలు వర్తిస్తాయని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. 2018 నుంచి ఫలితాల విడుదలలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని.. పరీక్షల నిర్వహణ కోసం టెక్నాలజీని వినియోగించామని తెలిపారు. డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేశామన్నారు. వచ్చే నెలలనే గ్రూపు1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ అభ్యర్థులు లేవనెత్తిన అంశాలపై అన్ని అంశాలపై కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లామని.. ఈ మేరకు అభ్యర్థులు గవర్నర్కు ఫిర్యాదు చేయగా.. ఏపీపీఎస్సీని రాజ్భవన్ వివరణ కోరిందన్నారు. పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు అన్ని అంశాలను గవర్నర్ కు వివరించామని.. అభ్యర్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పూర్తి పారదర్శకంగానే మూల్యాంకనం జరిగిందని వివరించారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీపీఎస్సీ యువతకు స్పష్టమైన హామీ ఇస్తుంది.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!