Andhra Pradesh: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగేళ్ల క్రితం నిర్వహించిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఎంపికైన 165 మంది అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం నాడు వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 167 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా 165 పోస్టులను భర్తీ చేసింది. మరో రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేసింది.
Read Also: Driverless Car: ఐఐటీ హైదరాబాద్ మరో ఆవిష్కరణ.. ఇండియాలోనే తొలి డ్రైవర్ లెస్ కారు టెస్ట్ రన్
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఏపీపీఎస్సీ గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ లో 167 పోస్టులలో డిప్యూటీ కలెక్టర్లు-30, అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్స్-8, డీఎస్పీలు-27, డీఎస్సీ(జైళ్ల శాఖ)-1, డీఎఫ్వో-1, అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు-11, ఆర్టీవోలు-5, అసిస్టెంట్ ప్రొహిబిషన్-మల్టీజోన్1 – 06, మల్టీ జోన్ 2-05, ఎంపీడీవోలు-47, జిల్లా రిజిస్ట్రార్లు-01, జిల్లా ఉపాధి కార్యాలయం-02, సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్స్- 01(జోన్-2), 01 (జోన్-3), జిల్లా గిరిజన అధికారి-01, ఎస్సీ సంక్షేమ అధికారి-01, బీసీ సంక్షేమ అధికారి-01, డీపీవో-01, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు-1, ఏపీ వైద్యారోగ్య పరిపాలన శాఖలో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు- మల్టీజోన్1- 06, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 2 (జోన్-3), 4 (జోన్-4)
కాగా గ్రూప్-1 పరీక్షల ఫలితాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని.. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 167 పోస్టుల భర్తీకి లక్షన్నరకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని.. 325 మందిని ఇంటర్వూ వరకు వచ్చారని.. కోర్టు తీర్పుకు లోబడి ఈ ఫలితాలు వర్తిస్తాయని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. 2018 నుంచి ఫలితాల విడుదలలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని.. పరీక్షల నిర్వహణ కోసం టెక్నాలజీని వినియోగించామని తెలిపారు. డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేశామన్నారు. వచ్చే నెలలనే గ్రూపు1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ అభ్యర్థులు లేవనెత్తిన అంశాలపై అన్ని అంశాలపై కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లామని.. ఈ మేరకు అభ్యర్థులు గవర్నర్కు ఫిర్యాదు చేయగా.. ఏపీపీఎస్సీని రాజ్భవన్ వివరణ కోరిందన్నారు. పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం వరకు అన్ని అంశాలను గవర్నర్ కు వివరించామని.. అభ్యర్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పూర్తి పారదర్శకంగానే మూల్యాంకనం జరిగిందని వివరించారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీపీఎస్సీ యువతకు స్పష్టమైన హామీ ఇస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!