Gidugu Rudraraju: ఏపీలో నిశ్శబ్ద విప్లవం రానుంది.. ప్రజలంతా కాంగ్రెస్వైపు చూస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APCC Chief Gidugu Rudraraju Comments After Meeting With Mallikarjun Kharge: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రానుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. ఏపీ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఖర్గేతో ఏపీ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించానని అన్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తాను చేపట్టిన పలు ప్రజా కార్యక్రమాల వివరాలను ఖర్గేకు అందజేశానని చెప్పారు. ఖర్గేను ఏపికి రావాలని ఆహ్వానించానన్నారు. విశాఖపట్నం, రాయలసీమలో త్వరలోనే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సభలకు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించామని పేర్కొన్నారు. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్లో జరిగిన సమావేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.
Actor Yash: ఎట్టకేలకు ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యశ్..?
Also Read
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
- YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
- Mega DSC 2025: మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక
జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు కురిపించడం ఆశ్చర్యంగా ఉందని గిడుగు రుద్రరాజు చెప్పారు. ఇన్నాళ్లూ అన్ని రకాలుగా అధికార వైసీపీ మద్దతు తీసుకొని.. ఇప్పుడు హఠాత్తుగా విమర్శలు చేయడం షాక్కి గురి చేసిందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన ఓటర్లందరూ.. తిరిగి వస్తారని విశ్వాసం తమకుందన్నారు. రెండు ప్రాంతీయ పార్టీల (టీడీపీ, వైసీపీ పార్టీలను ఉద్దేశించి) పాలన చూసిన ప్రజలు.. ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఏపీలో క్షేత్రస్థాయిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేలా ఏపీ ప్రజలు మద్దతివ్వాలని అభ్యర్థించారు. కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో రాబోయే ఎన్నికల్లో.. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు.
Green Card: ఇండియన్స్కి అమెరికా గుడ్ న్యూస్.. గ్రీన్ కార్డ్ నిబంధనల సరళీకరణ
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!