NTV Telugu Site icon

Andhra Pradesh: రేపు ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ కొత్త నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు(జూన్ 1) ఏపీ టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి.. జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి వినతులు అందాయి. వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం టెట్ పరీక్షలు నిర్వహించనుంది. ఏపీ టెట్(జులై)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధిన పూర్తి సమాచారం https://cse.ap.gov.in/ వెబ్ సైట్‌లో ఉంచామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. షెడ్యూల్, నోటిఫికెషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్ వివరాలన్నీ వెబ్ సైట్‌లో పెట్టామన్నారు. పరీక్షలు ఆన్లైన్ విధానంలో (CBT) జరుగుతాయన్నారు.

Read Also: DSC Notification: గత ప్రభుత్వమిచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు

మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. డీఎస్సీతో పాటు టెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే.. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజి ఉండటంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు.