JC Kishore Kumar: మంచివాడే కానీ.. రీకాల్ చేసిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలో అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా ? ధరల నియంత్రణతో మంచి పేరు తెచ్చుకున్న అధికారికి…అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయా? వ్యవహారానికి పుల్స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది.
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్. రెవెన్యూ విభాగానికి అధిపతి. జనవరి 2020 లో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన తొలినాళ్లలో మంచి పని వాడన్న ముద్ర వేసుకున్నారు. లాక్డౌన్లో నిత్యావసరాల ధరలను… ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ మార్కెట్లను ఏర్పాటు చేశాడు. ఉన్నతాధికారులతో మంచి పేరు తెచ్చుకున్నారు. మార్కెట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వ్యాపారుల్లో దడ పుట్టించారు. అక్రమ నిల్వలు ఉంటే సహించేది లేదని హెచ్చరించడంతో ప్రజలు హర్షించారు. ఇవన్నీ ఆయనకు చిక్కుల తెచ్చిపెట్టాయి. కొందరు అధికారులు కిశోర్కుమార్ను టార్గెట్ చేస్తూ హేళన చేసేవారు.
Also Read
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. 'పితృసమాన నేతను కోల్పోయాం'
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
మంచి అధికారిగా గుర్తింపు ఉన్నప్పటికీ…అవినీతి ఆరోపణలు అదే స్థాయిలో వచ్చాయ్. దీంతో జేసీ కిశోర్కుమార్ను…ప్రభుత్వం రీకాల్ చేసింది. కొత్తవలస, భోగాపురం, పూసపాటి రేగ, డెంకాడ, విజయనగరం మండలాల్లో…22ఏ భూముల బదలాయింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇనాం, మాజీ సైనికులకు ఇచ్చిన భూములకు సంబంధించి బదలాయింపుల ఫైళ్లను నిబంధనల ప్రకారం గ్రామ స్థాయి వీఆర్వో నుంచి తహసీల్దార్ ద్వారా జేసీ పరిష్కరించాలి. వారి ప్రమేయం లేకుండా జేసీ నేరుగా ఆ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. భోగాపురం విమానాశ్రయం భూముల వ్యవహారాల్లోనూ తప్పిదాలకు పాల్పడినట్లు తెలిసింది. వీటన్నింటిపై ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో… జేసీని రీకాల్ చేసినట్లు సమాచారం.
తనకున్న అధికారంతో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములను జిరాయతీగా మార్చే అధికారం జేసీకి ఉంది. దీన్నే ఆయుధంగా మార్చుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను మార్చేశారన్న ఆరోపణలున్నాయ్. ఇన్చార్జ్ కలెక్టర్గా ఉన్న సమయంలో..భోగాపురం ఎయిర్పోర్టు భూములకు సంబంధించి…22 ఫైళ్లను క్లియర్ చేసి…కోట్లు కూడబెట్టారన్న విమర్శలు ఉన్నాయ్. దీనికి తోడు అధికారుల మధ్య విభేదాలే…జేసీ కిశోర్ కుమార్ రీకాల్ కారణమని కొందరు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరి సహకారం లేకుండా రెవెన్యూలో ఏ పని జరగదన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ను రీకాల్ చేసిన ప్రభుత్వం…ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!