JC Kishore Kumar: మంచివాడే కానీ.. రీకాల్ చేసిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలో అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా ? ధరల నియంత్రణతో మంచి పేరు తెచ్చుకున్న అధికారికి…అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయా? వ్యవహారానికి పుల్స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది.
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్. రెవెన్యూ విభాగానికి అధిపతి. జనవరి 2020 లో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన తొలినాళ్లలో మంచి పని వాడన్న ముద్ర వేసుకున్నారు. లాక్డౌన్లో నిత్యావసరాల ధరలను… ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ మార్కెట్లను ఏర్పాటు చేశాడు. ఉన్నతాధికారులతో మంచి పేరు తెచ్చుకున్నారు. మార్కెట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వ్యాపారుల్లో దడ పుట్టించారు. అక్రమ నిల్వలు ఉంటే సహించేది లేదని హెచ్చరించడంతో ప్రజలు హర్షించారు. ఇవన్నీ ఆయనకు చిక్కుల తెచ్చిపెట్టాయి. కొందరు అధికారులు కిశోర్కుమార్ను టార్గెట్ చేస్తూ హేళన చేసేవారు.
Also Read
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
మంచి అధికారిగా గుర్తింపు ఉన్నప్పటికీ…అవినీతి ఆరోపణలు అదే స్థాయిలో వచ్చాయ్. దీంతో జేసీ కిశోర్కుమార్ను…ప్రభుత్వం రీకాల్ చేసింది. కొత్తవలస, భోగాపురం, పూసపాటి రేగ, డెంకాడ, విజయనగరం మండలాల్లో…22ఏ భూముల బదలాయింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇనాం, మాజీ సైనికులకు ఇచ్చిన భూములకు సంబంధించి బదలాయింపుల ఫైళ్లను నిబంధనల ప్రకారం గ్రామ స్థాయి వీఆర్వో నుంచి తహసీల్దార్ ద్వారా జేసీ పరిష్కరించాలి. వారి ప్రమేయం లేకుండా జేసీ నేరుగా ఆ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. భోగాపురం విమానాశ్రయం భూముల వ్యవహారాల్లోనూ తప్పిదాలకు పాల్పడినట్లు తెలిసింది. వీటన్నింటిపై ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో… జేసీని రీకాల్ చేసినట్లు సమాచారం.
తనకున్న అధికారంతో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములను జిరాయతీగా మార్చే అధికారం జేసీకి ఉంది. దీన్నే ఆయుధంగా మార్చుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను మార్చేశారన్న ఆరోపణలున్నాయ్. ఇన్చార్జ్ కలెక్టర్గా ఉన్న సమయంలో..భోగాపురం ఎయిర్పోర్టు భూములకు సంబంధించి…22 ఫైళ్లను క్లియర్ చేసి…కోట్లు కూడబెట్టారన్న విమర్శలు ఉన్నాయ్. దీనికి తోడు అధికారుల మధ్య విభేదాలే…జేసీ కిశోర్ కుమార్ రీకాల్ కారణమని కొందరు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరి సహకారం లేకుండా రెవెన్యూలో ఏ పని జరగదన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ను రీకాల్ చేసిన ప్రభుత్వం…ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!