AP EAPCET 2022: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP EAPCET 2022 results are out: ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్-2022 ఫలితాలను విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్ పరీక్షలను జులై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 3,84,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు 3.01 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 2.82 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షను 1.94లక్షల మంది, అగ్రికల్చర్ పరీక్షను 87 వేల మంది విద్యార్థులు రాశారు. ఇంజినీరింగ్లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.
Read Also: Mahendra Singh Dhoni: ధోనీకి షాక్.. సుప్రీంకోర్టు నోటీసులు
Also Read
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
ఇంజనీరింగ్లో టాప్టెన్లో ఒక్కస్థానంలో కూడా అమ్మాయిలు చోటు దక్కించుకోలేకపోయారు. అటు టాప్ టెన్లో తెలంగాణ విద్యార్థులు నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. మొదటి ర్యాంకర్గా శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బోయ హరేన్ సాత్విక్ నిలిచాడు. అతడికి 160 మార్కులకు గాను 158.62 మార్కులు వచ్చాయి. డో ర్యాంకర్గా ఒంగోలు జిల్లాకు చెందిన లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి నిలిచాడు. అతడికి 158.55 మార్కులు వచ్చాయి. మూడో ర్యాంకర్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన హిమ వంశీ (157.93 మార్కులు) నిలిచాడు. అటు అగ్రికల్చర్ విభాగంలో మొదటి ర్యాంకర్గా గుంటూరు జిల్లాకు చెందిన దినేష్ కార్తిక్ రెడ్డి నిలిచాడు.
కాగా త్వరలోనే అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి బొత్స తెలిపారు. మొత్తం స్థానాల్లో 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్మెంట్ కోటాఉంటుందన్నారు. గత ఏడాది 15 శాతం ఎన్ఆర్ఐ కోటా ఉండేదని.. మిగిలిన 15 శాతం కన్వీనర్ కోటా ఉండేదని.. వీటిపై న్యాయపరమైన చిక్కులు వచ్చాయని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఒక విధానం తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొత్తం ఇంజనీరింగ్ సీట్లు 1,48,243 అని పేర్కొన్నారు. టాపర్స్కు, ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరికీ మంత్రి బొత్స అభినందనలు తెలియజేశారు. ప్రైవేటు కాలేజీల్లో 35 శాతం సీట్లు జగనన్న విద్యా దీవెన కింద కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక
-
Haryana: ‘‘సువేందు బీఫ్ వండాను, తింటావా’’.. మహిళ ఓవరాక్షన్కు శిక్ష..
-
G Parameshwara: పరమేశ్వరకు లక్కీ ఛాన్స్.. కొత్త ప్రభుత్వంలో కీలక పదవి!
-
Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Anirudh Reddy : తెలంగాణలో పోటీకి సిద్ధమా.? అనిరుధ్ రెడ్డి రాజకీయ సవాల్
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!