AP EAPCET 2022: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP EAPCET 2022 results are out: ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్-2022 ఫలితాలను విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్ పరీక్షలను జులై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 3,84,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు 3.01 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 2.82 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షను 1.94లక్షల మంది, అగ్రికల్చర్ పరీక్షను 87 వేల మంది విద్యార్థులు రాశారు. ఇంజినీరింగ్లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.
Read Also: Mahendra Singh Dhoni: ధోనీకి షాక్.. సుప్రీంకోర్టు నోటీసులు
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇంజనీరింగ్లో టాప్టెన్లో ఒక్కస్థానంలో కూడా అమ్మాయిలు చోటు దక్కించుకోలేకపోయారు. అటు టాప్ టెన్లో తెలంగాణ విద్యార్థులు నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. మొదటి ర్యాంకర్గా శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బోయ హరేన్ సాత్విక్ నిలిచాడు. అతడికి 160 మార్కులకు గాను 158.62 మార్కులు వచ్చాయి. డో ర్యాంకర్గా ఒంగోలు జిల్లాకు చెందిన లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి నిలిచాడు. అతడికి 158.55 మార్కులు వచ్చాయి. మూడో ర్యాంకర్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన హిమ వంశీ (157.93 మార్కులు) నిలిచాడు. అటు అగ్రికల్చర్ విభాగంలో మొదటి ర్యాంకర్గా గుంటూరు జిల్లాకు చెందిన దినేష్ కార్తిక్ రెడ్డి నిలిచాడు.
కాగా త్వరలోనే అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి బొత్స తెలిపారు. మొత్తం స్థానాల్లో 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్మెంట్ కోటాఉంటుందన్నారు. గత ఏడాది 15 శాతం ఎన్ఆర్ఐ కోటా ఉండేదని.. మిగిలిన 15 శాతం కన్వీనర్ కోటా ఉండేదని.. వీటిపై న్యాయపరమైన చిక్కులు వచ్చాయని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఒక విధానం తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొత్తం ఇంజనీరింగ్ సీట్లు 1,48,243 అని పేర్కొన్నారు. టాపర్స్కు, ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరికీ మంత్రి బొత్స అభినందనలు తెలియజేశారు. ప్రైవేటు కాలేజీల్లో 35 శాతం సీట్లు జగనన్న విద్యా దీవెన కింద కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!