Site icon NTV Telugu

Andhra Pradesh: రేపు నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్

Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ రెండో విడత నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం జగన్ నంద్యాల జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10:15 గంటలకు ఆయన ఆళ్లగడ్డ చేరుకుంటారు. ఉదయం 10:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు.

Read Also: Vishakapatnam: పవన్ కళ్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..?

అనంతరం వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ రెండో విడత నగదు బదిలీ నిధులను బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. మధ్యాహ్నం 12:35 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఆళ్లగడ్డలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కర్నూలు జిల్లాలో ఈనెల 18 నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల సందడి పెరిగింది. సోమవారం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ జరగనుండటంతో కాంగ్రెస్ డెలిగేట్లు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Exit mobile version