Kota Srinivas Death : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణంపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు అయిన కోట శ్రీనివాస్ మరణించారు అన్న వార్త తనను ఎంతో కలిచి వేసిందన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ కోట శ్రీనివాస్ తనదైన ముద్ర వేశారు. ప్రజలకు ఎంతో దగ్గరైన వ్యక్తి ఆయన. విజయవాడ ప్రజలు ఆయన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.
Read Also : RIP Kota Srinivasa Rao: యువతలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేశారు: కిషన్ రెడ్డి
బీజేపీకి ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పట్లోనే బీజేపీని ఆయన ఇక్కడ గుర్తించేలా చేశారని చెప్పుకొచ్చారు. సినిమా రంగంలో ఎన్నో సేవలు అందించారు కోట శ్రీనివాస్. వైవిధ్యభరితమైన పాత్రలతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన లేని లోటు అటు సినీ ఇండస్ట్రీకి, ఇటు రాజకీయాలకు తీరని లోటు అంటూ చెప్పుకొచ్చారు మాధవ్.
Read Also : Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్..
