AP Accident : ఏపీలో ఘోర ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూలీల ఆటోను ఢీకొట్టింది.. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ఘటన ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలోచోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు వెళుతున్నారు. అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట వైపు వెళ్తుంది.. వేగంగా వచ్చిన బస్సు లింగంగుంట్ల బస్ స్టాప్ వద్దకు రాగానే అదుపు తప్పి ఆటోను ఢీ కొట్టింది..
Also Read
బస్సు ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది.. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యాకసిరి హనుమాయమ్మ, గన్నవరపు శివపార్వతి , షేక్ హజరత్ వలీ మృతి చెందారు. గాయపడిన 13 మందిలో గోరంట్ల శివకుమారి , సురుగుల కోటేశ్వరమ్మ ల పరిస్థితి విషమంగా ఉంది.. మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..