Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం

  • 2027 జూన్ నాటికి పూర్తి లక్ష్యం
  • కేంద్రం నుంచి రూ.3,300 కోట్ల అదనపు నిధులు
  • న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
  • పునరావాసం, నిర్మాణ పనులకు వేగం
Pawankalyan

Pawankalyan

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన అద్భుత ప్రతిభపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఆయన కొనియాడారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం పైగా మెరుగుపడడం విశేషమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని ఆయన విశ్లేషించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న కార్యాచరణను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా పరీక్షలకు ముందు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు తీసుకువచ్చిన ‘100 రోజుల ప్రణాళిక’ , తల్లిదండ్రులను విద్యా ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు నిర్వహించిన ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’ వంటి కార్యక్రమాలు విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించాయని ఆయన కొనియాడారు.

ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం పట్ల పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది అది 78.39 శాతానికి పెరగడం గమనార్హం. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులకు ఆయన అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల చదువుల పట్ల ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.