Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం రివార్డు.. రూ.50 లక్షలు అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి దంగేటి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది. వ్యోమగామి కావాలన్న జాహ్నవి కల సాకారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.50 లక్షల చెక్కును జాహ్నవికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు బుధవారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. తన కల సాకారం అయ్యే దిశగా ఈ మేర ఆర్థిక సాయం చేసిన సీఎం జగన్కు జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు. వ్యోమగామికి వెళ్లాలని తన కోరిక అని.. తన కల నెరవేరదేమోనని అనుకుంటున్న సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణును కలిశానని.. మంత్రి వేణు చొరవతో తనకు ఆర్ధిక సాయం చేసేందుకు సీఎం జగన్ అంగీకరించారని.. ఆయన చేసిన ఆర్ధిక సాయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని జాహ్నవి తెలిపింది.
Read Also: Alcohol Effects: ఆల్కాహాల్ వల్ల కాలేయమే కాదు.. ఇవి కూడా దెబ్బతింటాయి.
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
వ్యోమగామిగా వెళ్లాలనే జహ్నావి అనే పేద బాలికకు సీఎం జగన్ ఆర్ధిక సాయమందించారని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. వ్యోమగామి కావాలంటే ఇంటర్నేషనల్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు చేయాల్సి ఉందని.. ఆ పైలెట్ ట్రైనింగ్ కోర్సు నిమిత్తం రూ. 50 లక్షలు అందించారని తెలిపారు. పేదల కలలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. కాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతోంది. ఓ వైపు ఇంజినీరింగ్ చదువుతూనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయురాలిగానే కాకుండా తొలి ఆసియా ఖండ వాసిగా కూడా జాహ్నవి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో తాను వ్యోమగామి కావాలన్న సంకల్పంతో సాగుతున్న జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది.
తాజావార్తలు
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
-
Ben Stokes Returns: ‘క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!