Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం రివార్డు.. రూ.50 లక్షలు అందజేత
Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి దంగేటి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది. వ్యోమగామి కావాలన్న జాహ్నవి కల సాకారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.50 లక్షల చెక్కును జాహ్నవికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు బుధవారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. తన కల సాకారం అయ్యే దిశగా ఈ మేర ఆర్థిక సాయం చేసిన సీఎం జగన్కు జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు. వ్యోమగామికి వెళ్లాలని తన కోరిక అని.. తన కల నెరవేరదేమోనని అనుకుంటున్న సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణును కలిశానని.. మంత్రి వేణు చొరవతో తనకు ఆర్ధిక సాయం చేసేందుకు సీఎం జగన్ అంగీకరించారని.. ఆయన చేసిన ఆర్ధిక సాయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని జాహ్నవి తెలిపింది.
Read Also: Alcohol Effects: ఆల్కాహాల్ వల్ల కాలేయమే కాదు.. ఇవి కూడా దెబ్బతింటాయి.
Also Read
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
- Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
వ్యోమగామిగా వెళ్లాలనే జహ్నావి అనే పేద బాలికకు సీఎం జగన్ ఆర్ధిక సాయమందించారని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. వ్యోమగామి కావాలంటే ఇంటర్నేషనల్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు చేయాల్సి ఉందని.. ఆ పైలెట్ ట్రైనింగ్ కోర్సు నిమిత్తం రూ. 50 లక్షలు అందించారని తెలిపారు. పేదల కలలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. కాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతోంది. ఓ వైపు ఇంజినీరింగ్ చదువుతూనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయురాలిగానే కాకుండా తొలి ఆసియా ఖండ వాసిగా కూడా జాహ్నవి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో తాను వ్యోమగామి కావాలన్న సంకల్పంతో సాగుతున్న జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది.
తాజావార్తలు
-
Chegg Downfall: ఒకప్పుడు ఎడ్టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్
-
Electric Scooters: హీరో, టీవీఎస్, లేదా ఏథర్.. దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?
-
IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
-
APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
-
Paytm Payments Bank: బిగ్షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!