Andhra Pradesh Liquor Licence: రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వానికి రూ.597 కోట్ల ఆదాయం
Andhra Pradesh Liquor Licence: ఏపీలో బార్ల లైసెన్సులకు బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జోన్-2,3 పరిధిలోని బార్ల ఈ వేలం ప్రక్రియ ఇవాళ్టితో పూర్తయ్యింది. ఇవాళ నిర్వహించిన బార్ల బిడ్డింగ్ ద్వారా రూ. 339 కోట్ల మేర ఆదాయం సమకూరింది. శని, ఆదివారాల్లో బార్ల వేలం ద్వారా మొత్తంగా రూ. 597 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బార్లకు అధికారులు ఈ వేలం నిర్వహించారు. ఆదివారం నాడు 492 బార్లకు ఈ-ఆక్షన్ నిర్వహించగా.. రెండు బార్లకు బిడ్డింగ్ జరగలేదు. ఆదివారం రోజు బార్లకు నిర్వహించిన ఈ వేలంలో దర్శి, మార్కాపురంలో అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రూ. 1.40 కోట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా 840 బార్లకు గానూ 817 బార్లకు ఈ వేలం నిర్వహించారు. మిగిలిన 23 బార్లకు త్వరలో ఈ-ఆక్షన్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
Read Also: Chandrababu: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి.. సీఎస్కు లేఖ రాసిన చంద్రబాబు
Also Read
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
కాగా జోన్-1, జోన్- 4 పరిధిలో బార్ల లైసెన్సులకు బిడ్డింగ్ శనివారం పూర్తయ్యింది. జోన్-1, జోన్-4లో నిర్వహించిన బిడ్డింగ్లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలు ఉన్నాయి. కడప, తిరుపతి, ప్రొద్దుటూరుల్లో ఎక్కువ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. కడపలో అత్యధికంగా ఓ బార్కు రూ. 1.81 కోట్లకు బిడ్ దాఖలు కాగా తిరుపతిలో ఓ బార్కు రూ. 1.59 కోట్లు, ప్రొద్దుటూరులో ఓ బార్కు రూ. 1.30 కోట్లకు బిడ్లు దాఖలయ్యాయి. నెల్లిమర్లలో అత్యల్పంగా రూ. 17 లక్షలకు బిడ్ దాఖలైంది. ఇవాళ జోన్-2, జోన్-3కి నిర్వహించిన బిడ్డింగ్ లో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదారి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ పాలసీ అమలవుతుంది. కొత్త బార్ పాలసీ ప్రకారం 2025 వరకు ఏపీ ప్రభుత్వం లైసెన్సులు జారీ చేయనుంది.
తాజావార్తలు
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
Toxic: యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!