Ramakrishna: అమరావతిపై మంత్రి ధర్మాన.. అధర్మంగా మాట్లాడుతున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, అమరావతి రాజధాని అంశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అధర్మంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ… వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా ఆమోదించిన విషయం వాస్తవమా కాదా..? అని నిలదీసిన ఆయన… ఆనాడే మూడు రాజధానులు కావాలని వైఎస్ జగన్ ఎందుకు చెప్పలేదు..? అని ప్రశ్నించారు… శాసనం, చట్టం, ధర్మాలను విస్మరించి వైసీపీ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి మూడు రాజధానుల పాట పాడడం దుర్మార్గం అని.. అమరావతి రైతులను రెచ్చగొట్టే పద్ధతుల్లో మంత్రులు వ్యాఖ్యానించడం తగదని హితవుపలికారు రామకృష్ణ.
Read Also: Munugode Bypoll: మునుగోడుపై సీఎం కేసీఆర్ సమావేశం.. రేపే అభ్యర్థి ప్రకటన?
Also Read
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తెలుగుదేశం పార్టీ హయాంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను అమలు చేయలేదని వ్యాఖ్యానించారు.. శ్రీకృష్ణ కమిటీ నివేదికనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని వివరించారు.. ఇక, రాజధాని మార్చుకోవడానికి ఓ చట్టం ఉందని.. కావాలంటే ఢిల్లీలో ఉన్న దేశ రాజధానిని కూడా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, అమరావతి రైతుల ఆవేదన కరెక్టే కావచ్చు… కానీ, అంత డబ్బును ఒక్క ప్రాంతంపైనే పెట్టే పరిస్థితి లేదని తెలిపారు.. రాజధాని ఏర్పాటుకు 55 వేల ఎకరాలు అవసరం లేదని స్పష్టం చేశారు.. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ రాజధాని కోసం వందల కిలో మీటర్లు వెళ్లాలా అని నిలదీశారు. విశాఖలో రాజధానిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!