ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 58,835 శాంపిల్స్ పరీక్షించగా 12,994 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 96 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 18,373 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,93,821 కి చేరగా.. యాక్టివ్ కేసులు 2,03,762 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 13,79,837 కరోనా నుంచి కోలుకోగా 10,222 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
ap corona