YS Jagan Mohan Reddy: వరద బాధితులకు సీఎం పరామర్శ.. నేను ఉన్నాను.. ఆదుకుంటాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ జిల్లాలో గోదావరి వరద బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శ కొనసాగుతోంది. ఇంటింటికి వెళ్తున్న జగన్.. బాధితులను పరామర్శించారు. నేను ఉన్నానని… ఆదుకుంటానని హామీ ఇచ్చారు. పి. గన్నవరం మండలం పుచ్చకాయలవారిపేటలో మొదలైన జగన్ పరామర్శ యాత్ర గండిపెదపూడిలంక, బూరుగులంక, అరిగెలలంకల గుండా సాగింది. రోడ్లన్నీ బురదగా ఉండటంతో ట్రాక్టర్ లో సీఎం పర్యటన సాగింది. గోదావరి వరదలకు పి. గన్నవరం మండలం తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యింది. పంటలతోపాటు… ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. వరద నీరు వెనక్కి వెళ్లినా… ఇళ్లలో ఇంకా బురద నిలిచే ఉంది. పరామర్శను మొక్కుబడిగా కాకుండా… ఇంటింటికి వెళ్లి బాధితులను పలకరించి, పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు జగన్. బాధితుల పిల్లల్ని ఎత్తుకున్నజగన్ వారిలో ఒకరిగా కలిసిపోయారు.
Read Also: Koffe With Karan: చివరిగా శృంగారంలో ఎప్పుడు పాల్గొన్నావ్.. విజయ్ దేవరకొండ బోల్డ్ ఆన్సర్
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
వశిష్ట కాల్వపై గండిపెదపూడిలంక దగ్గర వంతెన నిర్మించడం ద్వారా పై నాలుగు గ్రామాల ప్రజల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు జగన్. అలాగే పెదపూడిలంకలో గ్రామ సచివాలయ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోడానికి ప్రభుత్వం ఏం చేసిందో వివరించి చెప్పిన జగన్… పనిలోపనిగా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. బాధితులకు తాత్కాలికంగా కొంత సాయం చేశామని… ఇంకా ఏం చేయాలన్నదానిపై పరిశీలన జరుగుతోందని.. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదని… పశువులకు నోళ్లు ఉంటే… అవి కూడా ప్రభుత్వ సాయం గురించి సంతోషంగా చెప్పేవన్నారు జగన్.
ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించామని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. గంటిపెదపూడిలో వరద బాధితులను పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఒక్కరూ మాకు అందలేదు అనడం లేదు.. పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సహాయం చేశామన్నారు.. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు ఇవ్వాలి, వరదల్లో నేను వచ్చుంటే అధికారులు నాచుట్టూ తిరిగేవారు , ఫోటోల్లో టీవీల్లో బాగా కనిపించేవాడిని.. కానీ, నేను అలా కాదు.. వారంరోజులు టైమ్ ఇచ్చి వచ్చానని తెలిపారు. ఇక, జి.పి.లంక వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం.. ఈఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు ఏపీ సీఎం.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!