TDP vs YCP: తాడిపత్రిలో పోటాపోటీ కార్యక్రమానికి టీడీపీ-వైసీపీ పిలుపు.. వైసీపీకి పోలీసుల షాక్..
- తాడిపత్రిలో టీడీపీ-వైసీపీ పోటీపోటీ కార్యక్రమాలు..
- రెండు పార్టీల పిలుపుతో తాడిపత్రిలో పొలిటికల్ హీట్..
- వైసీపీ కార్యక్రమానికి అనుతి నిరాకరించిన పోలీసులు..
- కార్యక్రమం వాయిదా వేయాలని వైసీపీకి నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP vs YCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి పాలిటిక్స్ కాకరేపుతున్నాయి.. గతంలో.. అక్కడ వైసీపీ పై చేయి అన్నట్టుగా పరిస్థితి ఉంటే.. కూటమి సరార్క్లో టీడీపీదే పైచేయి అయిపోయింది.. అంటే మున్సిపల్ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిదే అంటున్నారు.. ఇక, ఇప్పుడు తాడిపత్రిలో పోటీపోటీగా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి తెలుగు దేశం పార్టీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దీంతో, రేపు ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారిపోయింది.. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా రేపు తాడిపత్రిలో వైసీపీ నిర్వహించదలిచిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.. ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని భావించిన పోలీసులు.. వైసీపీ జిల్లా అధ్యక్షునికి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నోటీసులు జారీ చేశారు..
Read Also: Tragic : యాదాద్రిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
తాడిపత్రిలో రేపు పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన టీడీపీ – వైసీపీ.. రీకాలింగ్ చంద్రబాబు పేరుతో రేపు తాడిపత్రిలో నియోజకవర్గస్థాయి విస్తృ స్థాయి సమావేశం జరుపుతామని వైసీపీ ప్రకటించగా.. ఇదే సమయంలో తాడిపత్రి రూరల్ పరిధిలోని వీరాపురంలో టీడీపీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.. రెండు కార్యక్రమాలు ఒకేసారి కావడంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు.. శాంతిభద్రతల దృష్ట్యా రేపు తాడిపత్రి లో వైసీపీ నిర్వహించదలిచిన కార్యక్రమానికి పోలీసుల అనుమతి నిరాకరించారు.. ఒకే రోజున రెండు పార్టీలు భారీగా సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలగవచ్చని భావించిన పోలీసులు.. రేపటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలంటూ వైసీపీ జిల్లా అధ్యక్షునికి నోటీసులు ఇచ్చారు.. అయితే, దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు.. యథావిథిగా రేపటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారా? లేదా పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. వాయిదా వేసుకుంటారా? అనేది ఉత్కంఠగా మారిపోయింది..
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?