NTV Telugu Site icon

Road Accident: తాడిపత్రిలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Road Accident

Road Accident

Road Accident: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుండి వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మృతులు ప్రతాప్ రెడ్డి ( 22), ప్రమీల(21) ఘటనా స్థలంలోనే కన్నుమూయగా.. వెంకటమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.. కాగా, తాడిపత్రి మండలం గన్నెవారిపల్లెకు చెందిన ప్రతాప్ రెడ్డి.. ఓ వివాహం నిమిత్తం తన భార్య ప్రమీల అత్త వెంకటమ్మలతో కలిసి కడపకు బయలుదేరి వెళ్లారు. వివాహం చూసుకున్న తర్వాత తాడిపత్రికి తిరిగి వెళ్తున్న సమయంలో బొందలదిన్నె దాటిన తర్వాత వంగనూరు సమీపంలో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రతాప్ రెడ్డి, ప్రమీలలు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన వెంకటమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: Astrology: ఆగస్టు 21, బుధవారం దినఫలాలు