Anakapalli Tensions: అనకాపల్లి జిల్లాలో హైటెన్షన్.. భూసేకరణను వ్యతిరేకిస్తున్న ప్రజలు!
- అనకాపల్లి జిల్లాలో కొనసాగుతున్న హై టెన్షన్..
- బల్క్ డ్రగ్ పార్క్ కోసం మరోసారి భూ సేకరణకు సిద్ధమైన ప్రభుత్వం..
- అదనపు భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన..
- వివిధ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు..
- వామపక్షాలు, వైసీపీ నాయకులు ముందస్తుగా అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalli Tensions: అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్కు కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. భారీ బందోబస్తు, ముందస్తు అరెస్టులతో వాతావరణం వేడెక్కింది. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కుకు సంబంధించి రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణను పీసీబీ ప్రారంభించింది. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు మొత్తం 1,514 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 700 ఎకరాలకు సంబంధించి రెండున్నరేళ్ల కిందట మొదటి విడత ప్రజాభిప్రాయసేకరణ జరిగింది.
Read Also: Intelligence Alert: దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులలో హై అలర్ట్.. భద్రతకు ముప్పు!
Also Read
అయితే, బల్క్ డ్రగ్ పార్కుకు మరో 814 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించేందుకు ఏపీఐఐసీ, పర్యావరణం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ భూములు సీహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, ఎన్.నర్సాపురం, ఉపమాక, ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామాల పరిధిలో ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిర్వాసితులకు సంబంధించి 15 నుంచి 20 మంది తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. అయితే, బల్క్ డ్రగ్ పార్కుకు తమ భూములు ఇచ్చేది లేదంటూ ఆయా గ్రామాల రైతులు, మత్స్యకారులు కొద్ది రోజుల నుంచి సీపీఎం, వైసీపీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!