చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా..
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు భగ్గమన్నాయి. ఈ ఘటనపై నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36గంటల దీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర పరిణామాలను వివరించేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి వెళ్లిన ఆయన సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విషయంపై కూడా రాష్ట్రపతికి వెల్లడించారు. అనంతరం మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేశారు.
కానీ.. కశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్షా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. వెనువెంటనే కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడంతో.. ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. దీంతో అమిత్షాను చంద్రబాబు కలవలేకపోయారు. చంద్రబాబు కలిసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిన అమిత్ షా ఈ రోజు స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షాకు వివరించారు. అంతేకాకుండా ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని అమిత్ షాకు తెలిపినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..
-
Mumbai Indians: ముంబై డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు, ఈగో క్లాష్లు.. తీవ్ర అసంతృప్తిలో నీతా అంబానీ?
-
YS Jagan Foreign Tour: వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు
-
Mrunal Thakur : చుంకీ పాండేకు భార్యగా నటించడంపై మృణాల్ అసంతృప్తి
-
JD Chakravarthy: ‘చేతబడి’ చేస్తున్న జేడీ చక్రవర్తి!
ట్రెండింగ్
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!
-
T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!
-
Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!