AP Crime: వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ… ప్రియురాలి పనే..!
- కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన యువకుడి హత్య..
- హత్య కేసును ఛేదించిన రాజోలు పోలీసులు..
- ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.. మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోయల్ జార్జ్.. గుడిమెల్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి (భర్తను వదిలేసిన వివాహిత) ప్రేమలో పడ్డాడని.. దీంతో.. గత కొంతకాలంగా పెళ్లి కాకుండానే ఇద్దరూ సహజీవనం చేశారని తెలిపారు.. అయితే, గంజాయి మత్తు పదార్థాలకు బానిసైన నోయల్ జార్జ్.. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని తన అన్న రాపాక ప్రకాష్ కు ప్రశాంతి చెప్పిందని వెల్లడించారు.
Read Also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్స్టార్..
Also Read
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
అయితే, కాకినాడలో ఉంటున్న నోయల్ జార్జిని పథకం ప్రకారం ప్రశాంతి తో ఫోన్ చేయించి ప్రకాష్ దిండికి రప్పించాడు..రాపాక ప్రశాంతి, తన అన్న ప్రకాష్, స్నేహితుడు ఎర్రంశెట్టి ప్రేమ్ కుమార్ ముగ్గురు కలిసి నోయల్ జార్జ్ పై ఇనుప రాడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు.. వీరి నుండి తప్పించుకుని పారిపోయే సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మృతుడు జార్జ్.. కానీ, పారిపోతున్న నోయల్ జార్జిని పట్టుకుని ఇనుప రాడ్లతో కొట్టి ప్రాణం ఉండగానే దిండి బ్రిడ్జిపై నుండి గోదావరిలో విసిరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేలా చెప్పులు, మోటార్ సైకిల్ బ్రిడ్జిపై ఉంచి.. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు అని తెలిపారు. ఈ నెల 10వ తేదీన నోయల్ జార్జి తండ్రి రత్న రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా మొదట నమోదు చేశాం.. ఈ నెల 13 న అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రం తీరాన లభ్యమైన నోయల్ జార్జ్ మృతదేహహంపై ఉన్న గాయాలతో సూసైడ్ కాదని ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని నిర్ధారణ చేసి కేసు నమోదు శాం.. హత్యకు కారణమైన నిందితులను రిమాండ్ కి తరలింవామని సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!