Paddy Bills Fraud: రైతుల పంట సొమ్ము అక్రమాలపై కలెక్టర్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంటసొమ్ము చెల్లింపుల అక్రమాలపై జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తీవ్రంగా స్పందించారు. రావులపాలెం(మ)దేవరపల్లిలో రైతుల పంట సొమ్ము అక్రమాలపై స్పందించిన కలెక్టర్ హిమాన్సుశుక్లా విచారణకు ఆదేశించారు. 20 మంది రైతుల ఖాతాల్లో కోటి 20 జమ అయిన సొమ్మును వెంటనే రికవరీ చేయాలంటూ రావులపాలెం తహసీల్దార్ కు ఆదేశాలు జారీచేశారు. దేవరపల్లి లో ఈకెవైసి చేయకుండా 37 మంది 2కోట్ల 70 లక్షలు ధాన్యం సొమ్ము మంజూరు అయింది.
దీంతో 20 మంది రైతుల ఖాతాల్లో కోటి 20 జమ అయింది. మరో12మంది ఖాతాల్లో నగదు నిలుపుదల చేశారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లారావులపాలెం మండలం దేవరపల్లిలో రైతుల పంట సొమ్ము అక్రమాలపై కలెక్టర్ హిమాన్సుశుక్లా స్పందించారు. రావులపాలెం మండలం దేవరపల్లిలో రైతుల పంట కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పంట నమోదు చేసి కొందరు రైతుల పేరునే మొత్తం భూమిని నమోదు చేసి దళారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేసుకొనేందుకు సహకరించారని అధికారుల విచారణలో తేలింది. దీంతో గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎస్ కె ఇసాద్ వలీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. 2కోట్ల 70 లక్షల పంటల కొనుగోలు సొమ్ము కొందరి రైతుల ఖాతాల్లో మాత్రమే జమ చేశారు.
Also Read
37 మంది రైతుల ఖాతాల్లో మొత్తంగా నగదు జమ జరిగింది. ఇప్పటికే 20 మంది రైతుల ఖాతాల్లో కోటి 20 లక్షల రూపాయలు నగదు విత్ డ్రా కాగా మిగిలిన 17మంది ఖాతాల్లో జమ అయిన నగదును అధికారులు నిలుపుదల చేశారు.దేవరపల్లి గ్రామ 2 ఆర్ బికె సెంటర్ లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రైతు భరోసా కేంద్రం పరిధిలో సాగు చేసే రైతుల మొత్తం పంట నమోదు చేయకుండా ఆ మొత్తం భూమిని కొంత మంది పేరున నమోదు చేసారు. దీంతో ఒక్కో రైతు ఖాతాలో పది లక్షల నగదు పడటంతో అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేయగా రైతుల పంట నమోదు జరగని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కోనసీమ కలెక్టర్ హిమాన్సు శుక్లా సంబంధిత విఎఎ వలీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మిగిలిన అధికారుల పాత్ర ఏదైనా ఉందనేది దానిపై కూడా విచారణ చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటికే మూడు చోట్ల ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రైతుల ఖాతాల్లో జమ అయిన నిధులను రికవరీ చేయాలని కలెక్టరేట్ ఆదేశించడంతో రావులపాలెం తహశీల్దార్ వెంటనే చర్యలు చేపట్టారు.
Read Also: Jagadish Reddy : మోడీ సొంత రాష్ట్రంలో ఆసరా ఫించన్ 750 రూపాయలే
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!