Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై వైసీపీ ఆగ్రహం..
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
- హైకోర్టు ను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులను తొలగించడంపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ అంశంపై ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దీంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుని హైకోర్టును ఆశ్రయించేందుకు వైసీపీ నిర్ణయించింది. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వాక్ స్వాతంత్ర్య హక్కును హరిస్తోందని, ప్రధాన ప్రతిపక్షం గొంతును అణిచివేసే ప్రయత్నం జరుగుతోందని పిటిషన్లో వైసీపీ పేర్కొంది.
వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి వందలాది పోస్టులను బ్లాక్ చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకుండానే పోస్టులను తొలగిస్తున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. సోషల్ మీడియా పోస్టులను బ్లాక్ చేయడానికి సెక్షన్ 69A లేదా కోర్టు ఆదేశం అవసరమని ‘ష్రేయా సింఘాల్’ తీర్పును వైసీపీ తన పిటిషన్లో ప్రస్తావించింది. అయితే ఈ రెండు మార్గాల్లో ఏదీ అనుసరించకుండానే పోస్టులను తొలగిస్తున్నారని ఆరోపించింది.
Also Read
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
అలాగే, పోలీసులు సెక్షన్ 79(3)(b) కింద నోటీసులు జారీ చేసి, 36 గంటల్లోగా సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని ఆదేశిస్తున్నారని వైసీపీ పేర్కొంది. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలను నియంత్రించడం ద్వారా తమ వాక్ స్వాతంత్ర్య హక్కును హరిస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ అంశంపై నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా ముందుగా హైకోర్టులో పరిష్కారం కోరాలని ధర్మాసనం సూచించింది. దీంతో వైసీపీ సుప్రీంకోర్టు పిటిషన్ను ఉపసంహరించుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించనుంది.
తాజావార్తలు
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?