NTV Telugu Site icon

YSRCP: జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసిన వైసీపీ బృందం.. విజయవాడ ఘటనపై ఫిర్యాదు

Ysrcp

Ysrcp

YSRCP: ఢిల్లీ వెళ్లిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల బృందం.. జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసింది.. జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు వైసీపీ నేతలు.. విజయవాడలో డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.. ఈ అంశంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు ఆపివేసి, సీసీ కెమెరాలు ఆపేసి.. ఈ దాడికి దిగారని ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు వివరించింది వైసీపీ నేతల బృందం.. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఎస్సీ లపై జరుగుతున్న దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, ఢిల్లీ వెళ్లిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల బృందంలో ఎంపీ గురుమూర్తి , మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, కైలే అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

Read Also: Telangana: ఇలా కూడా ఉంటారా?.. మనవడిని అమ్మేసిన నాయనమ్మ.. దత్తత పేరుతో డ్రామా!