YS Jagan: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్..
- NTV జర్నలిస్టుల అరెస్టులను ఖండించిన వైఎస్ జగన్..
- ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి..
- పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి..
- బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయటం దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్.. ఎన్టీవీ ఆఫీసులో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. జర్నలిస్టుల అరెస్టులు పత్రికా స్వేచ్ఛకే కాకుండా ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి అని ఖండించారు. పండుగ సమయంలో అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి పోలీసులు తలుపులు పగులగొట్టి ప్రవేశించి, చట్టపరమైన విధి విధానాలు పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం అత్యంత దారుణం అని పేర్కొన్నారు.
Read Also: NTV Journalists Arrest: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన ఏపీయూడబ్ల్యూజే..
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
జర్నలిస్టులు నేరస్తులు కూడా కాదని.. ఉగ్రవాదులు కూడా కాదని స్పష్టం చేసిన వైఎస్ జగన్.. అయినప్పటికీ వారిపై అనవసరంగా కఠినంగా వ్యవహరించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని అన్నారు. ఈ తరహా చర్యలు జర్నలిస్టుల కుటుంబాలకు తీవ్రమైన మానసిక వేదనను కలిగించడమే కాకుండా, మొత్తం మీడియా వర్గంలో భయాందోళనలను సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. టెలికాస్ట్ అయిన వార్తలపై అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలను అనుసరించాలని, సంబంధిత సంస్థలను సంప్రదించాలని అన్నారు. కానీ పోలీసు, అధికార బలాన్ని ఉపయోగించి జర్నలిస్టులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని తీవ్రంగా తప్పుబట్టారు. అరెస్టు చేసిన ఎన్టీవీ జర్నలిస్టులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించి, చట్టపాలనను కాపాడాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.
I strongly condemn the arrests of NTV journalists, which amount to a direct attack on the freedom of the press and democratic values. Forcefully entering journalists’ homes by breaking doors at midnight during this festival and arresting them without following due legal procedure…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!