YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: డీఎస్సీ నియామక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అభ్యర్థులకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. న్యాయపరంగా పోరాటం చేసే అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయాన్ని అందించడమే కాకుండా లీగల్ ఖర్చులన్నింటినీ పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు. అభ్యర్థులతో సమావేశమైన జగన్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్న ప్రతి కేసుపై భవిష్యత్తులో రీ-ఎంక్వైరీ నిర్వహిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు.
స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జగన్ ప్రశ్నలు లేవనెత్తారు. పరీక్షలు నిర్వహించకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడానికి జీవో జారీ చేశారని, నియామకాలు పూర్తయ్యాక అదే జీవోను మార్చి కొత్త జీవో తీసుకువచ్చారని విమర్శించారు. మొదట తీసుకొచ్చిన జీవో ఎవరికోసం, ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి అన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కొందరికి మేలు చేసేలా వ్యవస్థను ఉపయోగించుకుని, పని పూర్తయిన తర్వాత జీవోను ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. క్రీడా కోటా పోస్టుల భర్తీలో పారదర్శకత కనిపించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. మొదటి ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. వెరిఫికేషన్కు హాజరు కాలేదనే కారణాలు చెబుతున్నప్పటికీ, అదే అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం వెనుక కారణాలను ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
డీఎస్సీ పరీక్షల నుంచి నియామకాల వరకు అనేక అంశాలు వివాదాస్పదంగా మారాయని జగన్ అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నుంచి ఎంపికల వరకు అనేక అంశాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థుల గ్రీవెన్స్లకు కూడా సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం చెబుతున్న వివరాల్లో స్పష్టత, పారదర్శకత లోపించాయని విమర్శించారు. ఇదిలా ఉండగా, మీడియాతో మాట్లాడిన డీఎస్సీ అభ్యర్థులు కూడా నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో టెట్, బీఈడీ వంటి అర్హతలు లేకపోయినా కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలిచినప్పటికీ తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని వాపోయారు.
అలాగే కొందరి పేర్లు ఎంపికైన వారి జాబితాలోనూ, తిరస్కరించిన వారి జాబితాలోనూ లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు జగన్. ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే తమ పోస్టులను స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కేటాయించామని సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. నేషనల్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన అభ్యర్థులను కూడా పక్కన పెట్టారని పేర్కొన్నారు. జరిగిన పరిణామాలు, అనుమానాలు, అవకతవకలపై పూర్తి వివరాలను జగన్ దృష్టికి తీసుకెళ్లామని అభ్యర్థులు తెలిపారు. తమ సమస్యలను ఆయన ఓపికగా విన్నారని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?