Polavaram Project: తక్కువ సమయంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం.. ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లకు అభినందనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం విజయవంతంగా పూర్తైంది. ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన భాగమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ, ఈ మహత్తర నిర్మాణాన్ని సమయానికి పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగేందుకు వారు చూపిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
Read Also: Bitter Gourd Recipe: కాకరకాయలోని చేదుకు ఇలా వీడ్కోలు చెప్పండి..! ఇక, లొట్టలేసుకు తింటారు..
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మొత్తం 1372 మీటర్ల పొడవు గల డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తవడం పోలవరం ప్రాజెక్టు పురోగతిలో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తవడంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. అలాగే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని, దానిని పునర్నిర్మించడానికి అదనంగా రూ.1000 కోట్లు వెచ్చించాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్లుగా, అన్ని పనులను సమయానికి పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమివ్వాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి అవసరాలు తీరడంతో పాటు అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన 'డయాఫ్రం వాల్' నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు. దీనికి… pic.twitter.com/yfwsbBcgyq
— N Chandrababu Naidu (@ncbn) April 2, 2026
తాజావార్తలు
-
Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
-
Jaishankar in Kyiv: రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
-
OTR: స్థానిక సమరం.. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో గుబులు..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!