New Land Registration Charges: ఏపీలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. నేటి నుంచే అమలు..
- ఏపీలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు..
- నేటి నుంచి అమల్లోకి పెరిగిన ఛార్జీలు..
- ఏపీలో నిన్న అర్ధరాత్రి వరకూ కొనసాగిన రిజిస్ట్రేషన్లు..
- రిజిస్ట్రేషన్ల కోసం బారులు తీరిన జనం..
- ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల రిజిస్ట్రేషన్లు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Land Registration Charges: ఏపీలో ఇవాళ్టి నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నాయి. జనవరి 31వరకే ప్రస్తుత ధరలు ఉండగా.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కనీసం 20 శాతం పెరుగనున్నాయి. దీంతో తక్కువ ధరలతో జరిగిన క్రయవిక్రయాలను రిజిస్టర్ చేసుకోవడానికి నిన్నటి వరకు క్లయింట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టారు. రెండు, మూడు రోజులుగా ఏపీలో ఏ రిజిస్ట్రార్ ఆఫీస్ చూసినా జనాలతో కిటకిటలాడాయి. బుధవారం అమావాస్య రావడంతో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు కాలేదు. ఎదురు అమావాస్య అని మంగళవారం కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లలేదు. దీంతో.. గురు, శుక్రవారాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
Read Also: Congress MLC Candidate: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు ఖరారు
Also Read
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ రద్దీగా మారడంతో.. దాని ప్రభావం సర్వర్లపై పడింది. సాధారణం కంటే రిజిస్ట్రేషన్లు డబుల్ అవుతుండటంతో.. పలు ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కంప్యూటర్లు మొరాయించాయి. సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో సిబ్బంది రాత్రి వరకూ పని చేయాల్సి వచ్చింది. వచ్చిన డాక్యుమెంట్లన్నింటినీ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిన్న కూడా అర్ధరాత్రి దాటే వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!