Ration Rice Distribution: ‘రేషన్’వార్.. కూటమి వర్సెస్ వైసీపీ..!
- రేషన్ దుకాణాల్లో వస్తువుల పంపిణీ ప్రారంభం..
- వైసీపీ తీసుకొచ్చిన వాహనాల వ్యవస్థకు బ్రేక్..
- రేషన్ షాపుల్లోనే ఇకనుంచి ఆయా వస్తువుల పంపిణీ.. వైసీపీ - కూటమి నేతల మధ్య పరస్పరం విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Rice Distribution: ఆంధ్రప్రదేశ్లో రేషన్ వాహనాలను తొలగించారు.. ఇంటింటికి తీసుకొచ్చి వాహనాల్లో రేషన్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టం వస్తుందని కూటమి ప్రభుత్వం వీటిని తొలగించింది.. వీటి స్థానంలో రేషన్ షాపులోనే ఇకనుంచి రేషన్ ఇవ్వనున్నారు. ప్రతి నెల 15 రోజులు పాటు రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు.. దివ్యాంగులకు ఇంటి వద్దకు తెచ్చి ప్రతి నెల 5వ తేదీ లోపు రేషన్ అందిస్తారు.. ఇకనుంచి రేషన్ దుకాణాలను రేషన్ మాల్స్ గా మార్చి మిగిలిన వస్తువులు కూడా అందించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది..
Read Also: Rajendra Prasad : మళ్లీ నోరు జారిన నటుడు రాజేంద్ర ప్రసాద్.. అలీని తిట్టేశాడు..
Also Read
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
గత ప్రభుత్వం పై పౌర సఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రమైన విమర్శలు చేశారు.. గత ప్రభుత్వం రేషన్ వాహనాలను ఉపయోగించడం వల్ల 1700 కోట్లకు పైగా నష్టం వచ్చింది అన్నారు.. అదే విధంగా రేషన్ వాహనాల్లో మాఫియా వల్ల అక్రమ బియ్యం తరలింపు ఆస్కారం కలిగిందన్నారు.. రేషన్ వాహనాలు ఎప్పుడు వచ్చేవో కూడా తెలిసేది కాదన్నారు.. ఏదో ఒక మూల వాహనాన్ని పెట్టి కొంతమందికి రేషన్ ఇచ్చి వెళ్లిపోయే వారిని విమర్శలు చేశారు.. దీంతో ఖజానాకు నష్టం కాకుండా అక్రమ బియ్యం తరలింపు అస్కారాలు ఏర్పడింది అన్నారు నాదెండ్ల మనోహర్.
Read Also: Sharmistha Panoli Arrest: పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్పై ఆగ్రహం..
అయితే, రేషన్ వాహనాలు తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.. వృద్ధులకు వికలాంగులకు దివ్యాంగులకు ఈ నిర్ణయం వల్ల తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది అన్నారు మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ . ప్రభుత్వం తీసుకున్న అనాలోచితం నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందన్నారు.. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.. రేషన్ వాహనాల్లో డ్రైవర్లు 70 నెలల కోసం గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు అని.. అర్ధాంతరంగా తొలగించడం ఎంతవరకు సమంజసం అన్నారు. గత ప్రభుత్వం లో బియ్యం అక్రమ రవాణా జరిగిందని అనవసర విమర్శలు చేయడం మంచిది కాదన్నారు అంబటి రాంబాబు… సీఎం చంద్రబాబు రేషన్ వాహన దారులను సంఘ విద్రోహ శక్తులుగా చూడడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి.. కూటమిలో ఎమ్మెల్యేలు బియ్యం అక్రమ రవాణాలో ఉన్నారని.. నాదెండ్ల మనోహర్ మొదటి స్మగ్లర్ అంటూ ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు.. మొత్తానికి రేషన్ వ్యవహారం టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది.. ఇప్పటికే రేషన్ వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు.. మరి రేషన్ దుకాణాలలో మళ్లీ రేషన్ ఇవ్వడం వల్ల ప్రజలకు ఎంత వరకు మేలు జరుగుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!