Ration Rice Distribution: ‘రేషన్’వార్.. కూటమి వర్సెస్ వైసీపీ..!
- రేషన్ దుకాణాల్లో వస్తువుల పంపిణీ ప్రారంభం..
- వైసీపీ తీసుకొచ్చిన వాహనాల వ్యవస్థకు బ్రేక్..
- రేషన్ షాపుల్లోనే ఇకనుంచి ఆయా వస్తువుల పంపిణీ.. వైసీపీ - కూటమి నేతల మధ్య పరస్పరం విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Rice Distribution: ఆంధ్రప్రదేశ్లో రేషన్ వాహనాలను తొలగించారు.. ఇంటింటికి తీసుకొచ్చి వాహనాల్లో రేషన్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా నష్టం వస్తుందని కూటమి ప్రభుత్వం వీటిని తొలగించింది.. వీటి స్థానంలో రేషన్ షాపులోనే ఇకనుంచి రేషన్ ఇవ్వనున్నారు. ప్రతి నెల 15 రోజులు పాటు రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు.. దివ్యాంగులకు ఇంటి వద్దకు తెచ్చి ప్రతి నెల 5వ తేదీ లోపు రేషన్ అందిస్తారు.. ఇకనుంచి రేషన్ దుకాణాలను రేషన్ మాల్స్ గా మార్చి మిగిలిన వస్తువులు కూడా అందించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది..
Read Also: Rajendra Prasad : మళ్లీ నోరు జారిన నటుడు రాజేంద్ర ప్రసాద్.. అలీని తిట్టేశాడు..
Also Read
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
గత ప్రభుత్వం పై పౌర సఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రమైన విమర్శలు చేశారు.. గత ప్రభుత్వం రేషన్ వాహనాలను ఉపయోగించడం వల్ల 1700 కోట్లకు పైగా నష్టం వచ్చింది అన్నారు.. అదే విధంగా రేషన్ వాహనాల్లో మాఫియా వల్ల అక్రమ బియ్యం తరలింపు ఆస్కారం కలిగిందన్నారు.. రేషన్ వాహనాలు ఎప్పుడు వచ్చేవో కూడా తెలిసేది కాదన్నారు.. ఏదో ఒక మూల వాహనాన్ని పెట్టి కొంతమందికి రేషన్ ఇచ్చి వెళ్లిపోయే వారిని విమర్శలు చేశారు.. దీంతో ఖజానాకు నష్టం కాకుండా అక్రమ బియ్యం తరలింపు అస్కారాలు ఏర్పడింది అన్నారు నాదెండ్ల మనోహర్.
Read Also: Sharmistha Panoli Arrest: పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్పై ఆగ్రహం..
అయితే, రేషన్ వాహనాలు తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.. వృద్ధులకు వికలాంగులకు దివ్యాంగులకు ఈ నిర్ణయం వల్ల తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది అన్నారు మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ . ప్రభుత్వం తీసుకున్న అనాలోచితం నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందన్నారు.. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.. రేషన్ వాహనాల్లో డ్రైవర్లు 70 నెలల కోసం గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు అని.. అర్ధాంతరంగా తొలగించడం ఎంతవరకు సమంజసం అన్నారు. గత ప్రభుత్వం లో బియ్యం అక్రమ రవాణా జరిగిందని అనవసర విమర్శలు చేయడం మంచిది కాదన్నారు అంబటి రాంబాబు… సీఎం చంద్రబాబు రేషన్ వాహన దారులను సంఘ విద్రోహ శక్తులుగా చూడడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి.. కూటమిలో ఎమ్మెల్యేలు బియ్యం అక్రమ రవాణాలో ఉన్నారని.. నాదెండ్ల మనోహర్ మొదటి స్మగ్లర్ అంటూ ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు.. మొత్తానికి రేషన్ వ్యవహారం టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది.. ఇప్పటికే రేషన్ వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు.. మరి రేషన్ దుకాణాలలో మళ్లీ రేషన్ ఇవ్వడం వల్ల ప్రజలకు ఎంత వరకు మేలు జరుగుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!