Nara Lokesh: టీడీపీ మంత్రులతో లోకేష్ సమీక్ష.. కొత్త ఎమ్మెల్యేల వ్యవహారంపై కీలక సూచనలు..
- కేబినెట్కు ముందు టీడీపీ మంత్రులతో మంత్రి నారా లోకేష్ సమావేశం..
- తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియడంలేదు..
- అవగాహనరాహిత్యంతో, అనుభవం లేక కొందరికి సమన్వయం ఉండట్లేదని వ్యాఖ్య..
- తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్లతో అవగాహన కల్పించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: కొత్త ఎమ్మెల్యేలపై మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు.. కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో.. ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో, కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రధానంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మరియు వారి పనితీరు చుట్టూ సాగాయి. తొలిసారి గెలిచిన కొంతమందికి మంచిచెడులు తెలియట్లేదు.. అనుభవం లేకపోవడం వల్ల సమన్వయం లోపిస్తోంది అని లోకేష్ అభిప్రాయపడ్డారు. కొత్త ఎమ్మెల్యేలు సీనియర్ల అనుభవాన్ని నేర్చుకోవాలి.. సమస్యలను ఎలా అధిగమించాలో అవగాహన అవసరం అని సూచించారు.. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలి.. లైన్లో పెట్టాల్సిన బాధ్యత మీదే అంటూ ఆదేశాలు జారీ చేశారట మంత్రి నారా లోకేష్..
Read Also: Maari Selvaraj: అంత ప్రేముంటే వాళ్ళ కులపోళ్లకే అవకాశాలివ్వచ్చుగా!
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారట లోకేష్.. సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించిన ఆయన.. ప్రత్యక్ష, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతి మంత్రి తమ శాఖ పరిధిలో ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరించాలి.. రేపు జరగబోయే MSME పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలి. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన త్వరగా నెరవేర్చుదాం అని సూచించారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!