Motkupalli Narasimhulu: ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motkupalli Narasimhulu: స్వర్గీయ ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ప్రజల పట్ల ఆయన చూపిన ప్రేమ, రాజకీయాల్లో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ లాంటి మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేమని అన్నారు. “డబ్బు కోసం ఎగబడేవాడు నిజమైన నాయకుడు కాదు. ఎన్టీఆర్ ప్రజల కోసం జీవించారు” అని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితాన్ని గుర్తుచేసుకున్న మోత్కుపల్లి, “నా దగ్గర రూపాయి కూడా లేకపోయినా, ఎన్టీఆర్ దయ వల్లే నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను” అని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నాయకుల ఆరాటమంతా డబ్బు, సీట్లు, పదవుల కోసమేనని విమర్శించారు.
పేదల కోసం మరో ఉద్యమం తీసుకొస్తా
ఎన్టీఆర్ ఆశీస్సులతో మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తానని మోత్కుపల్లి ప్రకటించారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే తాను ముందుకు సాగుతానని పేర్కొన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు..
Also Read
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
“9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు”
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి భారత రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్పై అక్కసు ఉండేదని, అందుకే ఆయనకు భారతరత్న, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి గౌరవాలు ఇవ్వలేదని ఆరోపించారు. మరోవైపు.. ఎన్టీఆర్పై అవినీతి ఆరోపణలు చేసిన వైఎస్సార్ కోర్టుకు రాకుండా తప్పించుకున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని, ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైఎస్సార్ ప్రయత్నించారని ఆరోపించారు. ఇక, రాష్ట్రాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు. లోకేష్ నాయకత్వం దెబ్బకు “గొడ్డలి పార్టీ” పరారవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆయన సేవలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని నేతలు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
-
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
-
Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!