Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Shortage: రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితులపై ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెట్రోల్, డీజిల్ సరఫరా, నిల్వలు, ఫిర్యాదులపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ కన్నబాబు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొంతమంది పెట్రోల్ బంకులు నిల్వలు ఉన్నప్పటికీ లేవని చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అలాంటి బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బల్క్గా డీజిల్, పెట్రోల్ను పక్కదోవ పట్టిస్తే సహించబోమని స్పష్టం చేశారు.
Read Also: AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు పెట్రోల్ బంకులపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. జిల్లా వారీగా వచ్చిన నివేదికలను పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రై అవుట్ పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని, ఆయిల్ కంపెనీల నుంచి డిస్పాచ్లు వేగవంతం అయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రేషన్ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అదే విధానం కొనసాగుతుందని చెప్పారు.
రైతులకు ఎలాంటి ఇంధన కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు నాదెండ్ల.. ముఖ్యంగా ఆక్వా రైతులు, రబీ పంట కోతల కోసం అవసరమైన డీజిల్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై కూడా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇంధన పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరే వరకు నిరంతర సమీక్ష కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!