AP Liquor Sales: ఏపీలో లిక్కర్ అమ్మకాల జోరు
- రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా లిక్కర్ అమ్మకాలు..
- అక్టోబర్ 16 నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు..
- డిసెంబర్ 9వ తేదీ వరకు.. 4వేల 677 కోట్ల మద్యం వ్యాపారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు.. 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. 61.63 లక్షల కేసుల మద్యం అమ్మారు. 19 లక్షల 33వేల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించగా.. వాటికి స్వస్తి పలికిన కూటమి ప్రభుత్వం.. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిచింది.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటు అయిన విషయం విదితమే..
Read Also: Trinamool Congress: ‘‘బాబ్రీ మసీదుని నిర్మిస్తాం’’.. తృణమూల్ నేత వ్యాఖ్యలతో వివాదం..
Also Read
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీవ్యాప్తంగా మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచాయి.. ఆ సమయంలో అనేక బ్రాండ్లు అందుబాటులో లేవని విమర్శలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ వాటిని ప్రైవేటు వారికి టెండర్ల రూపంలో ఇచ్చేలాగా నిబంధన తీసుకొచ్చింది.. దీని ప్రకారం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం చేకూరడంతో పాటుగా ప్రైవేట్ వ్యక్తులు మద్యం అమ్మకాలు చేపట్టడానికి రాష్ట్రంలో అవకాశం లభించింది మద్యం దుకాణాల కోసం టెండర్లను పిలవగా భారీగా రెస్పాన్స్ వచ్చింది మొత్తం 3300 కి పైగా దుకాణాలను టెండర్ల రూపంలో కేటాయించ టంతో ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది అక్టోబర్ 16వ తేదీ నుంచి మద్యం దుకాణాలు అమ్మకాలు ప్రారంభించాయి.. నిబంధన ప్రకారం షాపుల ఏర్పాటు చేయటంలో పాటు విధంగా కొందరు రాజకీయ నేతలు ఒత్తిడితో ఆలస్యంగా ప్రారంభమైన మద్యం దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి ఇప్పటికే కమిషన్ అంశానికి సంబంధించి 20 శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం దుకాణాల యజమానులు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. 20 శాతం ఇవ్వకుంటే నష్టాలు చవి చూస్తామని మద్యం దుకాణాలు టెండర్లు పాడుకున్న యజమానులు చెబుతున్నారు ఈ అంశం చర్చలో ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఏపీ వ్యాప్తంగా అటు మద్యం దుకాణాలు బార్లలో కలిపి అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 4677 కోట్ల ఆదాయం వచ్చింది. 6163508 మద్యం కేసులు,
1933560 కేసులు బీర్లు అమ్మకాలు జరిగాయి.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
-
Sharwanand : ‘జార్జ్ కృష్ణ’ కోసం మిస్ ఇండియా.. వైట్ల హిట్ ఇస్తాడా?
-
Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!