AP Liquor Sales: ఏపీలో లిక్కర్ అమ్మకాల జోరు
- రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా లిక్కర్ అమ్మకాలు..
- అక్టోబర్ 16 నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు..
- డిసెంబర్ 9వ తేదీ వరకు.. 4వేల 677 కోట్ల మద్యం వ్యాపారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు.. 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. 61.63 లక్షల కేసుల మద్యం అమ్మారు. 19 లక్షల 33వేల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించగా.. వాటికి స్వస్తి పలికిన కూటమి ప్రభుత్వం.. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిచింది.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటు అయిన విషయం విదితమే..
Read Also: Trinamool Congress: ‘‘బాబ్రీ మసీదుని నిర్మిస్తాం’’.. తృణమూల్ నేత వ్యాఖ్యలతో వివాదం..
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీవ్యాప్తంగా మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచాయి.. ఆ సమయంలో అనేక బ్రాండ్లు అందుబాటులో లేవని విమర్శలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ వాటిని ప్రైవేటు వారికి టెండర్ల రూపంలో ఇచ్చేలాగా నిబంధన తీసుకొచ్చింది.. దీని ప్రకారం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం చేకూరడంతో పాటుగా ప్రైవేట్ వ్యక్తులు మద్యం అమ్మకాలు చేపట్టడానికి రాష్ట్రంలో అవకాశం లభించింది మద్యం దుకాణాల కోసం టెండర్లను పిలవగా భారీగా రెస్పాన్స్ వచ్చింది మొత్తం 3300 కి పైగా దుకాణాలను టెండర్ల రూపంలో కేటాయించ టంతో ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది అక్టోబర్ 16వ తేదీ నుంచి మద్యం దుకాణాలు అమ్మకాలు ప్రారంభించాయి.. నిబంధన ప్రకారం షాపుల ఏర్పాటు చేయటంలో పాటు విధంగా కొందరు రాజకీయ నేతలు ఒత్తిడితో ఆలస్యంగా ప్రారంభమైన మద్యం దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి ఇప్పటికే కమిషన్ అంశానికి సంబంధించి 20 శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం దుకాణాల యజమానులు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. 20 శాతం ఇవ్వకుంటే నష్టాలు చవి చూస్తామని మద్యం దుకాణాలు టెండర్లు పాడుకున్న యజమానులు చెబుతున్నారు ఈ అంశం చర్చలో ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఏపీ వ్యాప్తంగా అటు మద్యం దుకాణాలు బార్లలో కలిపి అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 4677 కోట్ల ఆదాయం వచ్చింది. 6163508 మద్యం కేసులు,
1933560 కేసులు బీర్లు అమ్మకాలు జరిగాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!