AP Liquor Sales: ఏపీలో లిక్కర్ అమ్మకాల జోరు
- రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా లిక్కర్ అమ్మకాలు..
- అక్టోబర్ 16 నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు..
- డిసెంబర్ 9వ తేదీ వరకు.. 4వేల 677 కోట్ల మద్యం వ్యాపారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు.. 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. 61.63 లక్షల కేసుల మద్యం అమ్మారు. 19 లక్షల 33వేల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించగా.. వాటికి స్వస్తి పలికిన కూటమి ప్రభుత్వం.. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిచింది.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటు అయిన విషయం విదితమే..
Read Also: Trinamool Congress: ‘‘బాబ్రీ మసీదుని నిర్మిస్తాం’’.. తృణమూల్ నేత వ్యాఖ్యలతో వివాదం..
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీవ్యాప్తంగా మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచాయి.. ఆ సమయంలో అనేక బ్రాండ్లు అందుబాటులో లేవని విమర్శలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ వాటిని ప్రైవేటు వారికి టెండర్ల రూపంలో ఇచ్చేలాగా నిబంధన తీసుకొచ్చింది.. దీని ప్రకారం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం చేకూరడంతో పాటుగా ప్రైవేట్ వ్యక్తులు మద్యం అమ్మకాలు చేపట్టడానికి రాష్ట్రంలో అవకాశం లభించింది మద్యం దుకాణాల కోసం టెండర్లను పిలవగా భారీగా రెస్పాన్స్ వచ్చింది మొత్తం 3300 కి పైగా దుకాణాలను టెండర్ల రూపంలో కేటాయించ టంతో ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది అక్టోబర్ 16వ తేదీ నుంచి మద్యం దుకాణాలు అమ్మకాలు ప్రారంభించాయి.. నిబంధన ప్రకారం షాపుల ఏర్పాటు చేయటంలో పాటు విధంగా కొందరు రాజకీయ నేతలు ఒత్తిడితో ఆలస్యంగా ప్రారంభమైన మద్యం దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి ఇప్పటికే కమిషన్ అంశానికి సంబంధించి 20 శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం దుకాణాల యజమానులు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. 20 శాతం ఇవ్వకుంటే నష్టాలు చవి చూస్తామని మద్యం దుకాణాలు టెండర్లు పాడుకున్న యజమానులు చెబుతున్నారు ఈ అంశం చర్చలో ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఏపీ వ్యాప్తంగా అటు మద్యం దుకాణాలు బార్లలో కలిపి అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 4677 కోట్ల ఆదాయం వచ్చింది. 6163508 మద్యం కేసులు,
1933560 కేసులు బీర్లు అమ్మకాలు జరిగాయి.
తాజావార్తలు
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..