AP Liquor Shops Tenders: మద్యం షాపుల దరఖాస్తులకు నేడే లాస్ట్.. ఎక్సైజ్ శాఖ కీలక సూచనలు
- నేటితో ముగియనున్న మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ..
- రాత్రి 7 గంటల వరకే అవకాశం..
- కీలక సూచనలు చేసిన ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops Tenders: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపులను మూసివేస్తూ.. కొత్త పాలసీ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 3396 ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.. అందులో భాగంగా మద్యం షాపుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. వరుస సెలవుల నేపథ్యంలో.. మధ్యలో ఓసారి గడువు పొడిగించారు.. అయితే, ఇవాళ రాత్రి ఏడు గంటలతో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపులకు వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి.. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం 65,424 దరఖాస్తు చేసుకున్నారు.. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1308 కోట్ల మేర ఆదాయం వచ్చింది..
Read Also: IND vs BAN: హైదరాబాద్ టీ20లో భారీ మార్పులు.. మరో తెలుగు ప్లేయర్కు ఛాన్స్!
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా మద్యం షాపుల దరఖాస్తులు వచ్చాయి.. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపుల కోసం 48,39 దరఖాస్తుల దాఖలు కాగా.. అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 40 మద్యం దుకాణాలకు కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.. ఇవాళ రాత్రి వరకు గడువు ఉండడం వల్ల మరిన్ని దరఖాస్తులు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఈ నేపథ్యంలో.. కీలక సూచలను చేశారు ఏపీ అబ్కారీ శాఖ కమిషనర్
నిషాంత్ కుమార్.. మద్యం షాపుల దరఖాస్తులకు నేడు తుది గడువు అని స్పష్టం చేసిన ఆయన.. సాయంత్రం 7 గంటల వరకు ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందన్నారు.. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటలలోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లింపు చేసుకోవచ్చు అన్నారు.. ఇక, బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేవారు సాయంత్రం 7 గంటలలోపు క్యూ లైన్ లో ఉంటేనే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.. సంబంధిత పత్రాలతో సాయంత్రం 7 గంటల్లోపు SHOల్లో అందుబాటులో ఉన్నవారికి టోకెన్లు అందించి క్రమ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ చేస్తాం న్నారు.. దరఖాస్తు దారులు నిబంధనలు పాటించి సజావుగా కార్యక్రమం ముగిసేలా సహకరించాలని కోరారు ఏపీ ఎక్సైజ్ వాఖ కమిషనర్ నిషాంత్ కుమార్..
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..