NTV Telugu Site icon

Pawan Kalyan: ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం.. కో-ఆర్డినేటర్ల నియామకం..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీకలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచేది ఎవరూ అనేది తేలిపోయింది.. ఇక, ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే కూటమి పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాయి.. సీఎం చంద్రబాబు మంత్రులకు, నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఈ తరుణంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు..

Read Also: Rachita Ram : పొరిగింటి పుల్లకూర వద్దంటున్న కన్నడ భామ.!

ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి జనసేన తరపున పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా సమన్వయకర్తలను నియమించారు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఆయా పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కూటమి నేతలతో సమన్వయం చేసుకొంటూ, నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అభ్యర్ధుల విజయానికి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌..

పార్లమెంట్ నియోజక వర్గాలు – జనసేన సమన్వయకర్తలు:
* కాకినాడ – తుమ్మల రామస్వామి
* రాజమండ్రి – యర్నాగుల శ్రీనివాస రావు
* అమలాపురం – బండారు శ్రీనివాసరావు
* నరసాపురం – చన్నమల్ల చంద్ర శేఖర్
* ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు
* విజయవాడ – అమ్మిశెట్టి వాసు
* మచిలీపట్నం – బండి రామకృష్ణ
* గుంటూరు – నయబ్ కమల్
* నరసరావుపేట – వడ్రాణం మార్కండేయ బాబు