Jana Sena Party: ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు జనసేన కీలక విజ్ఞప్తి.. అది వ్యవస్థ లోపమే..!
- రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు జనసేన పార్టీ విజ్ఞప్తి..
- సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల కార్యాలయాలకు వినతులు వెల్లువ..
- చిన్నచిన్న సమస్యలకే రాష్ట్ర నాయకత్వం వరకు రావడం అంటే..
- అది వ్యవస్థ విఫలం అవుతున్నట్లు అర్థం చేసుకోవాలి..
- స్థానిక అధికార యంత్రాంగం పని చేయకపోతేనే ఈ పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Sena Party: జనసేన పార్టీ.. రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కీలక విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలకు ప్రతిరోజూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందుతున్న పరిస్థితి ఆందోళనకరమని జనసేన పేర్కొంది. చిన్నచిన్న సమస్యలకే ప్రజలు రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఆశ్రయించాల్సి వస్తోందంటే, అది వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదనే సంకేతమని స్పష్టం చేసింది. స్థానిక అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని జనసేన అభిప్రాయపడింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక పనులు క్షేత్ర స్థాయిలోనే పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. ఆ పెండింగ్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులదేనని స్పష్టం చేసింది.
Read Also: Apple Watch Series 11: ఆపిల్ వాచ్లపై భారీ డిస్కౌంట్.. ఎన్ని వేలు తగ్గిందో చూసేయండి!
Also Read
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
ప్రజలు తమ సమస్యలను ముందుగా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని జనసేన సూచించింది. అక్కడ స్పందన లేకపోతేనే రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఆశ్రయించాలన్నది పార్టీ విజ్ఞప్తి. ప్రజా సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు బాధ్యత తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జనసేన కోరింది. తమ పరిధిలో ఉన్న నిధులను ప్రజా సమస్యల పరిష్కారానికి సక్రమంగా వినియోగించుకోవాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు జనసేన సూచించింది. స్మశానం, డంపింగ్ యార్డ్, కరెంట్, ఆధార్, ఓటర్ కార్డ్ వంటి ప్రాథమిక సమస్యలు కూడా రాష్ట్ర స్థాయికి రావాల్సి వస్తుండటం పట్ల పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడు పేట పంచాయితీలో చోటుచేసుకున్న ఘటనను జనసేన ప్రత్యేకంగా ప్రస్తావించింది. అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న కరెంట్, ఆధార్, ఓటర్ కార్డ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. మొత్తంగా స్థానిక పాలనకు ఆదర్శంగా నిలవాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందుకు రావాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ప్రజల సమస్యలు స్థానిక స్థాయిలోనే పరిష్కారమయ్యేలా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది జనసేన పార్టీ..
తాజావార్తలు
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..