Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadikota Srikanth Reddy: ఎల్ నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ముందుచూపు కొరవడిందని విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని సమయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించడం లేదని విమర్శించారు. గత రెండేళ్లలో కనీసం ఒక్క రైతు కుటుంబానికైనా నష్టపరిహారం ఇచ్చారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా కొంతమేర రైతులకు నీరు అందుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్లను కనీసం నింపే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నీరు అందిస్తే కష్టపడి పంటలు పండించే రైతులు రాష్ట్రంలో ఉన్నారని అన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై విమర్శలు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కూడా శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యంతరం చెప్పడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను నిలిపివేశారని ఆరోపించారు. ఇది రాయలసీమ రైతులకు నష్టం కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని అన్నారు. కనీసం రిజర్వాయర్లను నింపే చర్యలు కూడా చేపట్టకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయలసీమ రైతులపై ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతోందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
Also Read
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
మూడు పంటలు పండే భూములు కూడా లాక్కున్నారు
మూడు పంటలు పండే రైతుల భూములను కూడా ప్రభుత్వం తీసుకుందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమతో పాటు కృష్ణా, గుంటూరు ప్రాంతాల రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం నష్టం కలిగిస్తోందని విమర్శించారు. నేడు ఎంతోకొంత మంది రైతులు నిలదొక్కుకుని వ్యవసాయం చేస్తున్నారంటే అందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సాగునీటి చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించడంలో అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన గుర్తు చేశారు.
వ్యక్తిగత రాజకీయాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం
వ్యక్తిగత ద్వేషాలతో రాజకీయ నాయకుడు పనిచేయకూడదని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయంలో రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కరువు పరిస్థితుల ఛాయలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటి నుంచే ముందుచూపుతో వ్యవహరించాలని సూచించారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక విమానాల్లో తిరగడం కంటే కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం స్వయంగా పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. రైతులకు సాగునీరు, నష్టపరిహారం అందించడంతో పాటు కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు వ్యవసాయాన్ని కొనసాగించేలా ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Romanchakam సక్సెస్ జోష్లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!