AP Weather: ఏపీ విభిన్నమైన వాతావరణం.. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు..
- ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు..
- కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather: ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి.. కొన్ని చోట్ల గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం.. కొన్ని చోట్ల మోస్తరు వానలు.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన.. ఇలా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
Read Also: TTD : తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సిఫార్సు లేఖల కోసం ప్రత్యేక పోర్టల్
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ఇక, రేపు అంటే శనివారం రోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆదివారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.. సోమవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
Read Also: TTD : తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సిఫార్సు లేఖల కోసం ప్రత్యేక పోర్టల్
మరోవైపు.. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల మధ్య రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా.. 23 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అత్యధికంగా నంద్యాల జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో 111.5 మిమీ, వైఎస్సార్ జిల్లా కలసపాడులో 110.7 మిమీ, నంద్యాల జిల్లా పెరుసోమలలో 107మిమీ, శ్రీసత్యసాయి జిల్లా కొండకోమర్లలో 101 మిమీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యిందన్నారు.. ఇదే సమయంలో.. ఈ రోజు పార్వతీపురంమన్యం జిల్లా జియ్యమ్మవలసలో 39.9 డిగ్రీ ఉష్ణోగ్రత, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 39.2, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 39.1, కాకినాడ జిల్లా జగ్గంపేట, విజయనగరం జిల్లా గుర్లలో 38.9, అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో 38.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!