Deputy CM Pawan Kalyan: కూటమి ప్రభుత్వంపై పవన్ కీలక వ్యాఖ్యలు.. అందుకే కొన్ని సమావేశాలు హాజరుకాలేదు..!
- మీడియా చిట్ చాట్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
- ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నాం..
- వెన్ను నొప్పి కారణంగానే కొన్ని సమావేశాలకి హాజరుకాలేకపోయా..
- కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది.. అయితే, ఈ మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని సమావేశాలకు దూరంగా ఉండడంపై సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.. అయితే, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారానికి.. ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్ కల్యాణ్.. మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు పవన్.. వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకి హాజరుకాలేకపోయానన్న ఆయన.. ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.. అయితే, ఏపీని వైఎస్ జగన్ అప్పుల కుప్పగా మార్చారు.. ఆ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీల అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం.. పర్యావరణ, అటవీ శాఖలు నాకు చాలా ఇష్టమైన శాఖలు.. నిబద్ధతతో నా మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్..
Read Also: Yuzvendra Chahal: క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు.. పోస్ట్ వైరల్
Also Read
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
కాగా, ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం వేదికపై ఎన్డీఏ నేతలను అందరినీ పలకరిస్తూ ముందుకు సాగిన ప్రధాని మోడీ.. ఏపీ డిప్యూటీ సీఎంను ప్రత్యేకంగా పలకరించారు.. ఇద్దరి మధ్య సరదా సంభాషణ సాగినట్టు ఆ దృశ్యాలను చూస్తుంటే స్పష్టమవుతుండగా.. ఆ ర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. మీరు హిమాలయాలకు వెళ్తున్నారా? అంటూ ప్రధాని మోడీ ప్రశ్నించారని.. వేదిక పైకి వచ్చే సమయంలో ఎన్డీఏ నేతలందరినీ పలకరించిన మోడీ.. ప్రత్యేక వస్త్రధారణలో ఉన్న పవన్ ను చూసి కొద్దిసేపు ముచ్చటించారు.. మోడీ ఏం మాట్లాడారని మీడియా ప్రతినిదులు ప్రశ్నించగా.. వివరాలు వెల్లడించిన ఆయన.. ప్రధాని నాపై చాలా సార్లు జోకులు వేస్తుంటారు.. ఈ రోజు నా వస్త్రధారణ చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తున్నావా? అని ప్రధాని అన్నారు.. అలాంటిదేమీ లేదని నేను చెప్పాను.. చేయాల్సింది చాలా ఉంది అని ప్రధాని మోడీకి చెప్పానంటూ వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!