Botsa Satyanarayana: అర్థం లేని ఆరోపణలు చేస్తే మేం సమాధానాలు చెప్పలేం..
- ప్రభుత్వంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు
- ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాలలో ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రావటం లేదు
- 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు- బొత్స సత్యనారాయణ
- మేము 2014 నుంచి మాట్లాడాలని అడిగాం- బొత్స సత్యనారాయణ
- అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగాం
- మాజీముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పాం- బొత్స.
ప్రభుత్వంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాలలో ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రావటం లేదని ఆరోపించారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు.. తాము 2014 నుంచి మాట్లాడాలని అడిగామని పేర్కొన్నారు. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పామని బొత్స పేర్కొన్నారు. విశాఖ సిట్ విచారణపై రిపోర్టులు బయట పెట్టాలని అడిగాం.. నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని చెప్పామని ఆయన తెలిపారు.
Read Also: World Kidney Day: ఆరోగ్యంగా ఉండాలంటే మూత్రపిండాల రక్షణ తప్పనిసరి
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదు.. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న అధికారులపై కూడా విచారణ చేయమని కోరుతున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వానికి దశ, దిశా లేదని దుయ్యబట్టారు. ఎదుటి వాళ్ళను అవమానపరచాలన్న ఆలోచన తప్ప మరొకటి కనిపించలేదని ఆరోపించారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై విచారణ చేసుకోమని చెప్పాం.. డిజిటల్ కరెన్సీపై మాట్లాడారు.. అది సరైనది కాదని బొత్స సత్యనారాయణ తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణలు తాము ఖండించడం లేదు.. సమర్ధించడం లేదన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమని కోరుతున్నామని వెల్లడించారు బొత్స సత్యనారాయణ.
Read Also: Sailesh Kolanu: “నా సినిమా సేఫ్..” కోర్ట్ సినిమాపై ‘హిట్ 3’ దర్శకుడు ఆసక్తికర పోస్ట్..
ప్రభుత్వం మనుషుల మీద బురద చల్లాలని చూస్తున్నారని బొత్స పేర్కొన్నారు. సభలో లేని వ్యక్తులపై మాట్లాడకూడదు.. కొన్నిసార్లు అలవాటులో జరుగుతుంది.. ప్రత్యేకంగా మాట్లాడితే సంప్రదాయం కాదని చెప్పామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మరోవైపు.. అమరావతిలో జరిగింది భూ స్కాం అని ఆరోపించారు. ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అర్థం లేని ఆరోపణలు చేస్తే తాము సమాధానాలు చెప్పలేమన్నారు. వైసీపీ మీద, తమ నాయకుడు మీద బురద చల్లాలని ఆరోపణలు చేశారు కాబట్టే.. తాము సభ నుంచి వాకౌట్ చేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
-
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!