Wild Cows: అడవి ఆవుల సమస్య పరిష్కరించండి.. సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్..
- సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి అడవి ఆవుల సమస్య..
- చందర్లపాడు మండలంలో పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఆవులు..
- సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్..
- 2,000 ఆవులను డ్రోన్ల సహాయంతో గుర్తించామన్న కలెక్టర్ లక్ష్మీ షా..
Wild Cows: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలోని చందర్లపాడు మండలంలో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అడవి ఆవుల సమస్యను జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా నది లంక ప్రాంతాల్లో సుమారు 2,000కు పైగా అడవి ఆవులు తిరుగుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. చందర్లపాడు మండలంలోని కృష్ణా నది లంక పొలాల్లో ఒకేసారి అడవి ఆవుల గుంపులు మేత కోసం పంటలపై పడి భారీగా నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పంటలను తొక్కి ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అడవి ఆవుల భయంతో పంటలను కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
Read Also: Shocking Murder: రెంటర్స్ ని అద్దె అడిగేందుకు వెళ్లిన ఇంటి ఓనర్.. ఆ తర్వాత ఏమైందంటే..
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
ఈ సమస్యను గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సౌమ్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, తాజాగా జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుంచి వివరించారు. అడవి ఆవుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్య పరిష్కారానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా గడ్డి పెంచే ప్రాంతాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటికే డ్రోన్ల సహాయంతో సుమారు 2,000 అడవి ఆవులను గుర్తించినట్లు వెల్లడించారు. కృష్ణా నది ఒడ్డున సుమారు 25 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అడవి ఆవులను పట్టుకుని అడవుల్లో వదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బాధ్యతను పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అడవి ఆవుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తేనే రైతాంగం ఊపిరి పీల్చుకుంటుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..
-
Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
-
Mohsin Khan: “మెయిడెన్ ఓవర్.. ఆపై వికెట్”.. వైభవ్ జోరుకు బ్రేక్ వేసిన లక్నో పేసర్.. మునుపెన్నడూ జరగలే!
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?