Wild Cows: అడవి ఆవుల సమస్య పరిష్కరించండి.. సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్..
- సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి అడవి ఆవుల సమస్య..
- చందర్లపాడు మండలంలో పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఆవులు..
- సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్..
- 2,000 ఆవులను డ్రోన్ల సహాయంతో గుర్తించామన్న కలెక్టర్ లక్ష్మీ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wild Cows: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలోని చందర్లపాడు మండలంలో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అడవి ఆవుల సమస్యను జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా నది లంక ప్రాంతాల్లో సుమారు 2,000కు పైగా అడవి ఆవులు తిరుగుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. చందర్లపాడు మండలంలోని కృష్ణా నది లంక పొలాల్లో ఒకేసారి అడవి ఆవుల గుంపులు మేత కోసం పంటలపై పడి భారీగా నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పంటలను తొక్కి ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అడవి ఆవుల భయంతో పంటలను కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
Read Also: Shocking Murder: రెంటర్స్ ని అద్దె అడిగేందుకు వెళ్లిన ఇంటి ఓనర్.. ఆ తర్వాత ఏమైందంటే..
Also Read
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
- Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
ఈ సమస్యను గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సౌమ్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, తాజాగా జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుంచి వివరించారు. అడవి ఆవుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్య పరిష్కారానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా గడ్డి పెంచే ప్రాంతాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటికే డ్రోన్ల సహాయంతో సుమారు 2,000 అడవి ఆవులను గుర్తించినట్లు వెల్లడించారు. కృష్ణా నది ఒడ్డున సుమారు 25 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అడవి ఆవులను పట్టుకుని అడవుల్లో వదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బాధ్యతను పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అడవి ఆవుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తేనే రైతాంగం ఊపిరి పీల్చుకుంటుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్పై సూర్యకాంత్ కీలక ప్రకటన
-
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
-
Lothukunta Land Case: లోతుకుంట భూముల కేసులో హైడ్రాకు హైకోర్టు షాక్..
-
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!