CM Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన.. అధికారుల తీరుపై తీవ్ర అసహనం..
- వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన..
- రెండు గంటల పాటు క్షేత్ర స్థాయి పర్యటన తర్వాత అధికారులతో సమీక్ష..
- సహాయక చర్యల్లో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీఎం..
- అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన ముఖ్యమంత్రి..
- తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: భారీ వర్షాలు, వరదలు.. కృష్ణా నదిలో వరద ఉధృతితో.. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, వరుసగా వర్షాలు, వరదలపై సమీక్షలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అవకాశం దొరికినప్పుడల్లా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్తున్నారు.. ఈ రోజు రెండు గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు.. రామలింగేశ్వర నగర్, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగగా.. సహాయక చర్యలను పరిశీలించారు.. ఆహారం అందుతుందా..? లేదా..? అనే అంశంపై ఆరా తీశారు.. రెండు గంటల పర్యటన అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలక్టరేట్ కు చేరుకున్న చంద్రబాబు… కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
రెండు గంటల పాటు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు.. తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం.. గత ప్రభుత్వం జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. బాధితులకు సహాయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వీడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పని తీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని.. కానీ, చెడ్డపేరు తెచ్చేలా ఉంటే మాత్రం ఊరుకునేది లేదంటా వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!