CM Chandrababu: తాళ్లవలసలో విజృంభించిన డయేరియా.. సీఎం చంద్రబాబు ఆరా..
- తాళ్లవలసలో డయేరియా కేసుల నమోదుపై చంద్రబాబు ఆరా..
- వృద్ధుని మరణానికి కిడ్నీ సమస్యతో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణం..
- శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో..
- డయేరియా కేసులు నమోదు కావడంపై కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని పరిస్థితులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు గ్రామంలోని ఆరుగురికి డయేరియా లక్షణాలు కనిపించగా, వారికి వెంటనే వైద్య సహాయం అందించడంతో పాటు టెక్కలి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరగా, మొత్తం బాధితుల్లో ఐదుగురు ఇంకా చికిత్స పొందుతున్నారని, ముగ్గురు రోగులు డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వివరించారు.
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ఈ ఘటనలో 70 ఏళ్ల చిన్నారావు అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే, చిన్నారావు మరణానికి డయేరియా కారణం కాదని, ఆయన ముందుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వల్ల గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని అధికారులు స్పష్టం చేశారు. ఇక, గ్రామంలో ఉన్న ఒక బావి నుంచి ఐదు పబ్లిక్ కుళాయిలకు నీరు సరఫరా అవుతుండగా, మరో రెండు చేతి పంపుల ద్వారా కూడా త్రాగునీరు అందుతోందని అధికారులు వివరించారు. ఈ నీటి నమూనాలను గ్రామీణ జలవనరుల శాఖ (RWS) పరీక్షించగా, నీటిలో ఎక్కడా కలుషితం లేదని, తాగడానికి సురక్షితమని తేలినట్లు తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా బావి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
Read Also: Andhra Pradesh: మా రాజీనామాలు ఆమోదించండి.. మండలి చైర్మన్కు ఎమ్మెల్సీల విజ్ఞప్తి..!
అయితే, డయేరియా కేసులు ఎందుకు వెలువడుతున్నాయో ఖచ్చితమైన కారణాన్ని గుర్తించాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రామంలో సరఫరా అవుతున్న నీటిలో మలినాలు కలుస్తున్నాయా? లేదా ఇతర కారణాల వల్లా ఈ సమస్య వస్తుందా? అన్నది స్పష్టంగా గుర్తించాలి” అని సీఎం సూచించారు. డిప్యూటీ DMHO, ఎపిడెమియాలజిస్ట్ గ్రామంలోనే ఉండి పరిస్థితులను పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని వివరించారు. తాళ్లవలసతో పాటు పరిసర గ్రామాల్లో కూడా పరిశుభ్రత, త్రాగునీటి నాణ్యతపై పర్యవేక్షణ పెంచాలని, ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!