CM Chandrababu: మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ.. ఆ శాఖలో ప్రక్షాళన జరగాల్సిందే..!
- కేబినెట్ అనంతరం మంత్రులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ..
- రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సంతృప్తిగా ఉన్నారు..
- 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే లక్ష్యం...
- పోలవరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేస్తాం..
- మార్కాపురం, మదనపల్లి, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి..
- రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, కీలక ప్రాజెక్టులు, వైద్య రంగం, రాజధాని పురోగతి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మాట్లాడుతూ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు అని వెల్లడించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడిన సీఎం, రాయలసీమను హార్టీకల్చర్ హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది అని తెలిపారు.
Read Also: Awantipora Operation: భారత్లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం.. ఒకరి అరెస్ట్
Also Read
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
ఇక, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమని పేర్కొన్న చంద్రబాబు.. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం అని ప్రకటించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. పోలవరాన్ని జాతీయ గుర్తింపుతో తీర్చిదిద్దేందుకు, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని తెలిపారు. మరోవైపు,, రాష్ట్రంలో వైద్య విద్య మరియు ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం పేర్కొన్నారు. మార్కాపురం, మదనపల్లి మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను కూడా త్వరగా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. అయితే, రాష్ట్ర పరిపాలనలో రెవెన్యూ శాఖ కీలకమని చెప్పిన సీఎం చంద్రబాబు.. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అని స్పష్టం చేశారు.. ప్రజలకు సులభ సేవలు అందేలా వ్యవస్థను మారుస్తాం అని మంత్రులకు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
అమరావతి:
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!