CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన, ఆయన సభలపై అక్కడి రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ సభలను అడ్డుకోవడం సరికాదని, రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. తాను ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చానని గుర్తు చేశారు. అక్కడ కర్ణాటకతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ప్రచారానికి వచ్చారని ఉదాహరణగా పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా ఉందని, గతంలో బీఆర్ఎస్ తమను జాతీయ పార్టీగా ప్రకటించుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ యూనిట్ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు చంద్రబాబు… రాష్ట్ర సరిహద్దులు దాటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం సాధారణ విషయమేనని, అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తనకు అర్థం కావడం లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వివిధ దేశాల్లో కీలక పదవులు చేపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో తెలుగువారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారని, అక్కడి చట్టాలు, రాజ్యాంగాల ప్రకారం సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించే వారే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు.
Also Read
- DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
తెలంగాణలో పవన్ కల్యాణ్పై కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మంచి రాజకీయ సంస్కృతికి నిదర్శనం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు ప్రజా చైతన్యం, ప్రజాసేవ విషయంలో పోటీ పడాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వారి మద్దతు పొందాలని సూచించారు. అనవసర వ్యాఖ్యలతో కొత్త సమస్యలను సృష్టించడం మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయిందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఎవరు ఏ ప్రాంతానికి ఎంత సేవ చేశారో ప్రజలకు బాగా తెలుసని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ వివాదాలకు తెరలేపడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
-
4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!