AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Update: ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఒకవైపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు కొన్ని మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. కొమొరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం వరకు మేఘావృత వాతావరణం కొనసాగనుంది. పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
శనివారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక, ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
వడగాలుల హెచ్చరిక
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండనుంది. శనివారం పోలవరం జిల్లాలోని కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అల్లూరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం పరిసర ప్రాంతాల్లోని 13 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కడప – 40.8°C
నంద్యాల జిల్లా పాణ్యం – 40.7°C
పోలవరం జిల్లా విఆర్ పురం – 40.6°C
పల్నాడు జిల్లా గురజాల – 40.5°C
కర్నూలు జిల్లా నగరడోన – 40.4°C
ఎన్టీఆర్ జిల్లా నందిగామ – 40.4°C
ఏలూరు జిల్లా కుక్కునూరు – 40.3°C
ప్రకాశం జిల్లా కొప్పెరపాడు – 40.2°C
నమోదైన వర్షపాతం
సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి:
నర్సీపట్నం – 16.2 మి.మీ
చిలకలూరిపేట, ఆకివీడు – 12 మి.మీ
ఉప్పుమాగులూరు – 10.5 మి.మీ
వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, పిడుగుల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..