AP High Court: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో కోర్టు కొన్ని కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ విచారణను వేగవంతం చేసింది. విచారణకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది.. సునీల్ నాయక్ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం, ఆయనకు తక్షణ ఉపశమనం కలిగిస్తూనే కొన్ని షరతులను విధించింది. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ లోపల విచారణ అధికారి (Investigating Officer) ముందు తప్పనిసరిగా హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని, విచారణాధికారి అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని సూచించింది.
Read Also: Hanuman Day Importance: మంగళవారం ఈ 5 వస్తువులను కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి..
ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఫైర్ సర్వీసెస్ డీఐజీ (DIG) గా విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్, ఆంధ్రప్రదేశ్లో నమోదైన ఒక కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్టు భయం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో జరిగిన కొన్ని పరిణామాలపై లోతైన విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్న తరుణంలో, కోర్టు ఇచ్చిన ఈ గడువు కీలకంగా మారింది. అయితే, హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం, నిర్ణీత గడువులోగా సునీల్ నాయక్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ను బట్టి ఈ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్పై తుది తీర్పు ఆధారపడి ఉంటుంది.
