Minister BC Janardhan Reddy: ఏపీలో కొత్తగా 6 విమానాశ్రయాలు..!
- భోగాపురం ఎయిర్పోర్టు గడువు కంటే ముందే పూర్తి..
- ఏపీలో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు..
- గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్ల మరమ్మతులపై రూ.20,000 కోట్ల అదనపు భారం..
- 15 వేల కి.మీ. మేర రహదారులు మరమ్మతులకు పనికిరాకుండా పోయాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister BC Janardhan Reddy: భోగాపురం ఎయిర్పోర్టు గడువు కంటే ముందే పూర్తి చేయబోతున్నాం… ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రహదారుల పరిస్థితి దారుణంగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో రోడ్ల సంరక్షణ, మరమ్మతులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వం భారీ ఆర్థిక భారం మోస్తోందని ఆయన తెలిపారు.
Read Also: BCCI Deadline: గంభీర్కు డెడ్ లైన్ ప్రకటించిన బీసీసీఐ !
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
అయితే, రహదారుల పునర్నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని వెల్లడించారు బీసీ జనార్ధన్ రెడ్డి.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్ల మరమ్మతులకు అదనంగా రూ.20,000 కోట్ల భారం పడిందన్న ఆయన.. మొత్తం 15,000 కిలో మీటర్ల మేర రహదారులు పూర్తిగా పనికిరానంతగా దెబ్బతిన్నాయి. మొత్తం 30,000 కిలో మీటర్లు రోడ్లు సరైన సంరక్షణ లేక పాడైపోయాయన్నారు.. అయితే, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ఇప్పటివరకు రూ.3,000 కోట్ల నిధులు వెచ్చించినట్టు పేర్కొన్నారు.. 22,000 కిలో మీటర్ల గుంతల రోడ్లను రూ.1,061 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. పీపీపీ మోడల్లో 175 రహదారులను 5,130 కిలో మీటర్ల పొడవు వరకు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు..
జగన్ పాలనలో ఆగిపోయిన పలు ప్రాజెక్టులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు బీసీ జనార్ధన్ రెడ్డి.. అనంతపురం ఎక్స్ప్రెస్వే, అమరావతి రింగ్ రోడ్, ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టులు ఉన్నాయన్నారు.. ఇక, మొంథా తుఫాన్ ప్రభావంతో 4,794 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి.. రూ.2,774 కోట్ల నష్టం సంభవించిందని తెలిపారు.. రహదారుల నిర్మాణ నాణ్యత కోసం డ్యానిష్ ఫైబర్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.15,000 కోట్ల వ్యయంతో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాదికి పూర్తిచేస్తాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గడువు ముందుగానే పూర్తి చేస్తామని.. రాష్ట్రంలో కొత్తగా 6 విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని.. రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది భారీ మలుపు అని తెలిపారు రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.
తాజావార్తలు
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!