NTV Telugu Site icon

Assistance to Flood Victims: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. వివరాలు ఇవే..

Floods

Floods

Assistance to Flood Victims: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని కృష్ణా నది, బుడమేరు వరద అతలాకుతలం చేసింది.. పూర్తిస్థాయిలో సహాయక చర్యలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు నష్ట పరిహారం పంపిణీపై దృష్టిసారించింది.. ఈ రోజు నాలుగు లక్షల మంది బాధితుల ఖాతాల్లో రూ. 602 కోట్లు జమచేసింది ప్రభుత్వం..

Read Also: PM Modi : హర్యానా మెగా ర్యాలీలో కాంగ్రెస్‌ పై విరుచుకుపడ్డ మోదీ

వరద బాధితులకు అందుతున్న పరిహారం..
* వరద సాయం కింద బాధితు ప్రజలకు, పంట నష్టం కింద రైతులకు పరిహారం రూపంలో ప్రజలకు అందించిన మొత్తం:- రూ.602 కోట్లు
* భారీ వర్షాలు వరదలకు చనిపోయిన వారు 74 మంది. రూ. 5 చొప్పున పరిహారం అందజేత
* భారీ వర్షాలకు చనిపోయిన పశ సంపద 1562
* రాష్ట్ర వ్యాప్తంగా మునిగిన ఇళ్లు 1,18,070-పరిహారం రూ.215 కోట్లు
* విజయవాడలో మొత్తం ముంపు నివాసాలు 78,558
* విజయవాడలో పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు 64,799
* గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ. 25 వేల చొప్పున సాయం రూ. 161.99 కోట్లు
* విజయవాడలో ఒకటి, ఆపై అంతస్తులు 13759 ఇళ్లు
* మొదటి ఆపై అంతస్తు వారికి రూ.10 వేల చొప్పున రూ.13.76 కోట్లు
* చనిపోయిన వారికి, పశు సంపదకు పరిహారం రూ.6.83 కోట్లు
* దెబ్బతిన్న 44402 ద్విచక్రవాహనాలకు రూ.3 వేల చొప్పున పరిహారం రూ.13.32 కోట్లు
* దెబ్బతిన్న 4348 ఆటోలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం రూ.4.34 కోట్లు
* దెబ్బతిన్న 1243 తోపుడు బండ్లకు రూ.20 చొప్పున రూ. 2.48 కోట్లు
* దెబ్బతిన్న 5,181 కిరాణా షాపులు, హోటల్స్ రూ. 25 వేల చొప్పున పరిహారం రూ.12.97 కోట్లు
* దెబ్బతిన్న 2500 చిన్నతరహా పరిశ్రమలకు రూ. 50 వేల చొప్పున రూ. 12.50 కోట్లు
* దెబ్బతిన్న 469 పరిశ్రమలకు రూ. లక్ష చొప్పున రూ. 4.69 కోట్లు.
* దెబ్బతిన్న 197 పెద్ద పరిశ్రమలకు రూ.1.50 లక్షల చొప్పున రూ. 2.95 కోట్లు
* మొత్తం దెబ్బతిన్న 8347 పరిశ్రమలకు పరిహారం రూ.33.97 కోట్లు
* పంటనష్టం వివరాలు…ప్రభుత్వ సాయం: మొత్తం 1,12,345 హెక్టార్లతో 22 రకాల వ్యవసాయ పంటలకు పరిహారం రూ. 278 కోట్లు
* మొత్తం 9236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్ట పరిహారం రూ. 32.67 కోట్లు