AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఏపీ విద్యాశాఖ దృష్టి..
- ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు ఉండే అవకాశం లేదని స్పష్టత..
- 13 జిల్లాల ఉపాధ్యాయ నియామకాలు.. 26 జిల్లాల ప్రకారం సర్దుబాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Education Department: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు బదులుగా టీచర్ పోస్టుల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రస్తుతం 13 జిల్లాల ఆధారంగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలను 26 జిల్లాల ప్రకారం సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టింది విద్యాశాఖ.. ఈ ఏడాది సాధారణ ఉపాధ్యాయుల బదిలీలు ఉండే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియ చేపట్టకుండా కేవలం పోస్టుల సర్దుబాటుపైనే దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తోంది..
Read Also: AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
Also Read
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
సర్దుబాటు ప్రక్రియలో స్పౌజ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు, దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్య సమస్యలు ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పాత జోనల్, ప్రస్తుత జోనల్ విధానాల ప్రకారం సీనియారిటీ, రిజర్వేషన్లు మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా ఉపాధ్యాయులకు తమ సొంత జోన్కు వెళ్లే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జోన్ల ప్రకారం ఉన్న ఉపాధ్యాయులకు తమ సొంత జిల్లా లేదా జోన్లో పనిచేసే అవకాశం ఇవ్వాలని పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే 26 జిల్లాలకు నోడల్ అధికారులను విద్యాశాఖ నియమించింది. ఈ అధికారులు సాధారణ పరిపాలన శాఖ (GAD), ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోస్టులు, సిబ్బంది వివరాలు, ఖాళీలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఉపాధ్యాయుల అవసరాలు, విద్యార్థుల నిష్పత్తి, పాఠశాలల అవసరాల ఆధారంగా సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది సమస్య కొంతవరకు పరిష్కారం కానుంది.
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి